తిరుపతి ఉప ఎన్నికల్లో రాణించడానికి ఏపీ బీజేపీ అన్ని రకాలుగా ప్రయత్నాలు స్టార్ట్ చేయటం తెలిసిందే. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాన్ని మండలాలుగా విభజించి కొంతమంది కీలక నాయకులకు బాధ్యతలు కమలనాథులు అప్పజెప్పడం జరిగింది. ఈ క్రమంలో ఏపీలో కూడా సర్జికల్ స్ట్రైక్ సెంటు తెలంగాణలో ఎక్కు పెట్టిన బాణాన్ని ఇక్కడ కూడా వదిలారు ఏపీ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు.
ఏకంగా రెండు సర్జికల్ స్ట్రైక్ చేస్తామని భారీ డైలాగులు వేశారు. జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వాడిన పదం తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపటం జరిగింది. ఒక్కసారిగా జిహెచ్ఎంసి ఎన్నికలలో వేడి పుట్టినట్లు అయింది. ఈ డైలాగుతో ఇతర పార్టీల నూతన ట్రాప్ లో పడేసింది కమలం పార్టీ.
వేసిన డైలాగులకు జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీ భారీ స్థాయిలో పొలిటికల్ మైలేజీ సంపాదించడమే ఫలితాలు కూడా అదే రీతిలో రాబట్టింది. దీంతో ఏపీ లో జరగబోయే తిరుపతి ఉప ఎన్నికల్లో సర్జికల్ స్ట్రైక్ సనే అస్త్రాన్ని బయటకు తీసింది. టెంపుల్ టౌన్ లో సమావేశాలు పెట్టి మరీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఈ ప్రకటన చేయటం ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. కానీ తెలంగాణలో వర్కవుట్ అయినట్టు ఈ ఫార్ములా ఏపీలో వర్క్ ఔట్ కావడం లేదని సొంత పార్టీలోనే టాక్ వస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పాతబస్తీలో రోహింగ్యాల పై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బండి సంజయ్ అనగా ఏపీలో వైసిపి, టిడిపి పార్టీ లపై రెండు సర్జికల్ స్ట్రైక్ చేస్తామని జీవీఎల్ వేసిన డైలాగులు అట్టర్ ఫ్లాప్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీలో బీజేపీకి అంత సీన్ లేదు అన్నట్టు ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోనట్టు జీవియల్ కామెంట్లు తుస్ మన్నట్లు రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.