తన అరెస్టుకు ఎ.పి ప్రభుత్వం కుట్ర చేస్తోందన అనుమానాన్ని ప్రముఖ జర్నలిస్ట్, టీవీ5 మూర్తి వ్యక్తంచేశారు.తన విషయంలో సంభవిస్తున్న పరిణామాలను వివరిస్తూ ఆయన ఒక వీడియో విడుదల చేశారు.
ప్రముఖ జర్నలిస్ట్ మూర్తిని, గత కొన్ని రోజులుగా ఏపి సిఐడి టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. యూనివర్సిటీలలో జరిగిన నియామకాల్లో, ఎవరి సిఫారుసుతో పదవి వచ్చిందో చెప్తూ, టీవీ5లో కొన్ని ఫైల్స్ చూపించారు. అయితే ఆ ఫైల్ బయటకు ఎలా వచ్చిందో కనుక్కోవాలి అంటూ, ప్రభుత్వం కేసు పెట్టటంతో, సిఐడి రంగంలోకి దిగింది. ఆ షోలో, పాల్గొన్న మాజీ జడ్జి శ్రవణ్ నిఏ1 గా, మూర్తిని ఏ2గా, టీవీ5 చైర్మెన్ ని ఏ3 గా చేర్చింది. వారందరికీ బెయిల్ కూడా వచ్చేసింది. అయితే సిఐడి విచారణకు పిలవటంతో, మూర్తి విజయవాడ వచ్చారు.అకడ జరిగిన పరిణామాల పై వీడియో రిలీజ్ చేసారు. ఏప్రిల్ 6 న జరిగిన ఒక షో విషయంలో, తమ పై సిఐడి కేసు పెట్టారని తెలిపారుతమ షో లో శ్రవణ్ వచ్చి, కొన్ని ఫైల్స్ చూపించారు… ఆ ఫైల్ ఎలా వచ్చింది అనేది శ్రవణ్ ని అడగాలి, కాని ఇక్కడ మాత్రం, ఆ షో పెట్టానని నా పైన, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, ఎడిటోరియల్ బోర్డు ని కాకుండా, సంస్థ చైర్మెన్ పై కూడా కేసు పెట్టారని, మూర్తి అన్నారు. అయితే కోర్టుకు వెళ్లామని, బెయిల్ వచ్చిందని అన్నారు.
కోర్టు సూచనల మేరకు,సిఐడి ఆఫీస్ కు ఈ నెల 12 న వెళ్లామని, బాండ్ పేపర్స్, ఆధారాలు, ష్యురిటీ ఇచ్చి, వాళ్ళు అడిగిన స్టేట్మెంట్ ఇచ్చి వచ్చామని తెలిపారు. అయితే ఆ రోజున తాము 24న, 29న రావాల్సి ఉంటుందని చెప్పారని తెలిపారు. కానీ 17వ తేదీన మీరు రావాలని చెప్పటంతో, మళ్ళీ వచ్చానని,మానసికంగా వేధించే విధంగా ప్రవర్తించారని, మాటిమాటికి పిలిచి, 10 గంటలు కూర్చోబెట్టి, వేధిస్తున్నారని అన్నారు. మళ్ళీ రేపు రావాలని చెప్పినట్టు తెలిపారు. ఇలా మాటిమాటికి రాలేమని,ఏదో ఒక రోజు మాకు రావటం కుదరలేదు అని చెప్తే, బెయిల్ రద్దు చేసి, అరెస్ట్ చేసే కుట్ర చేస్తున్నారేమో అని మూర్తి అనుమానం వ్యక్తంచేశారు. గత 25 ఏళ్ళుగా జర్నలిస్ట్ గా ఉన్నానని, ఏ తప్పు చెయ్యలేదని, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇలా వేధించి గొంతు నొక్కాలి అనుకుంటే అరెస్ట్ చేస్తే ఆగదని, అందుకే నా గొంతు ఆగాలి అంటే, నా ఊపిరి తీసేయండి అని మూర్తి అన్నారు.ఇది ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాలి