మార్కెట్ లోకి 20 రూపాయల నాణేలు వచ్చేశాయి. మొదటిసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 20 రూపాయల నాణేన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే 10 రూపాయల నాణెం మార్కెట్ లో చలామణిలో ఉన్న విషయం తెలిసిందే.
ఆర్బీఐ 20 రూపాయల నాణేలను గత నెల విడుదల చేసింది. అయితే ఈ నాణేలను ఎక్కువ సంఖ్యలో విడుదల చేయలేదు. కొన్ని మాత్రమే మార్కెట్ లోకి విడుదల చేసింది. ఢిల్లీలో ఆర్బీఐ ఈ కాయిన్స్ ను విడుదల చేయగా.. కాయిన్ కలెక్టర్లు వీటిని ముందుగా దక్కించుకున్నారు. అక్కడి నుంచి ఇవి ప్రస్తుతం మార్కెట్ లో చలామణి అవుతున్నాయి.
అయితే.. ఆర్బీఐ విడుదల చేసిన 20 రూపాయల కాయిన్ గురించి ప్రజలకు పెద్దగా తెలియదు. ఈ కాయిన్ మార్కెట్లలోనూ ఎక్కువగా అందుబాటులో లేదు. ఎక్కడో ఒక చోట మాత్రం ఈ కాయిన్ కనిపిస్తోంది. త్వరలోనే ఆర్బీఐ మరిన్ని కాయిన్స్ ను విడుదల చేసే అవకాశం ఉంది.
ఇక ఈ కాయిన్ ఎలా ఉందో ఇక్కడ ఉన్న ఫోటోలో చూడొచ్చు. 12 అంచులు కలిగిన పాలిగాన్ తో దీన్ని రూపొందించారు. దీన్నే డొడెకాగాన్ అని కూడా పిలుస్తారు. 27 మిల్లీమీటర్ల వ్యాసంతో 8.54 గ్రాముల బరువుతో ఈ కాయిన్ ను రూపొందించారు. జింక్, నికెల్, కాపర్ వంటి లోహాలను ఉపయోగించి ఈ కాయిన్ ను తయారు చేశారు.