Twitter: ప్రపంచ దేశాలలోనే అగ్రరాజ్యంగా పేరు పొందిన అమెరికా దేశానికీ మాజీ అధ్యక్షుడు అయిన డొనాల్డ్ ట్రంప్ కి తాజాగా ట్విటర్ గట్టి షాక్ ఇచ్చింది. ఇక ఎప్పటికి తమ సోషల్ మీడియా యాప్స్ లో ఆయనను అడుగుపెట్ట నివ్వమని, అలాగే ఒకవేళ ఆయన మళ్ళి వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినా అపుడు కూడా ఈ నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండబోదని ట్విటర్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగాల్ తేల్చి చెప్పేసారు. తమ పోలిసీలకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే అది ఎవరైనా ఇలానే తమ ట్విట్టర్ వేదిక నుంచి బాన్ చేస్తాం అని ఇది అందరికి వర్తించే సూత్రం అని అన్నారు.
ఈ సంవత్సరం జనవరి 6 వ తేదీన అమెరికా రాజధాని వాషింగ్టన్ లోని క్యాపిటల్ హిల్ వద్ద ట్రంప్ సృష్టించిన అల్లర్లు, ఘర్షణలను చుసిన తరువాత ట్విట్టర్, సహా ఫేస్ బుక్ ఇతర సోషల్ మీడియా సాధనాలు ట్రంప్ ని బ్యాన్ చేశాయి. ఎవరయితే ఇలా హింస ను సృష్టిస్తారో అటువంటి వారికి తిరిగి మళ్ళీ ఎప్పటికి అడుగుపెట్టనివ్వమని ట్విట్టర్ సైఫ్ఓ చెప్పారు. ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా ఉన్న సమయంలో తన ప్రచారానికే కానీ అల్లర్లను ప్రేరేపించడానికే కానీ ట్విటర్ ను చాలా ఎక్కువగా ఉపయోగించారు. ఆయన అకౌంట్ ను ట్విట్టర్ బాన్ చేసే సమయానికి ఆయనకు 80 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
ఈ సారి కూడా తనదే విజయం అంటూ ట్రంప్ చేసిన ప్రకటనలు, ఎలక్షన్ ల ప్రచారానికి విసిగిపోయిన ట్విట్టర్ ఇలా తుది నిర్ణయం తీసుకుంది. ఒకవేళ రానున్న 2024 ఎన్నికలలో మళ్ళి ట్రంప్ అధ్యక్షడిగా ఎన్నికైనా అప్పుడు కూడా ఆయన అకౌంట్ మీద ఉన్న బ్యాన్ ను తొలగించే సమస్యే లేదని అన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?