twitter: ప్రస్తుత కాలంలో దాదాపుగా చాలా మంది ట్విట్టర్ అకౌంట్ యూజ్ చేస్తున్నారు. కానీ వీటిలో కొందరు ఆకతాయిలు ఫేక్ న్యూస్, ఫేక్ మెసేజ్ లను స్ప్రెడ్ చేస్తూ.. యూజర్స్ ను తప్పుదోవ పట్టిస్తున్నారు. అలాంటి ఫేక్ న్యూస్కు చెక్ పెట్టేందుకు ట్విట్టర్ (twitter) కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం చాలా మార్పులు చేపట్టింది. వార్నింగ్ లేబుల్ అనే ఆప్షన్ ను తీసుకొచ్చింది. నెటిజన్స్ కు తప్పుడు సమాచారం ఇచ్చే విషయంపై ‘వార్నింగ్ లేబుల్ స్థాయి’ని చూడబోతున్నారు. దీనిని వరల్డ్ వైడ్ గా ట్విట్టర్ రిలీజ్ చేసింది. ఫేక్ న్యూస్ ను గుర్తించేందుకు ఆరెంజ్, రెడ్ రంగుల్లో రెండు వార్నింగ్ లేబుల్స్ను అందుబాటులోకి తెచ్చింది. వీటితో పాటు నీలి రంగు లేబుల్ సైతం ఉండనుంది.
Twitter: బెట్టువీడిన ట్విట్టర్..! ఎట్టకేలకు గ్రీవెన్స్ అధికారి నియామకం..!!
పర్ఫెక్ట్ మెసేజ్ అందించే చాన్స్..
గతేడాది జరిగిన యూఎస్ అధ్యక్ష ఎలక్షన్స్లో ట్విట్టర్లో ఫేక్ న్యూస్ చాలా ప్రచారమైంది. దీనిపై దృష్టి సారించిన ట్విట్టర్ ఇలాంటి వాటిని నివారించేందుకు చాలా రోజుల నుంచి కసరత్తులు ప్రారంభించింది. ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ప్రకారం.. యూజర్స్ కు పర్ఫెక్ట్ మెసేజ్ ను అందించేందుకు ఈ లేబుల్స్ ఉపయోగపడతాయి. దీని ఆధారంగా ఫేక్ న్యూస్, ఫొటోస్, వీడియోస్ను ఈజీగా ట్విట్టర్ నుంచి తొలగించేస్తారు. కొవిడ్ సంబంధిత తప్పుడు సమాచారంతో (fake news) యూజర్స్ ను తప్పు దారి పట్టించేలా ఉన్న మెజేస్ లను సైతం లేబుళ్ల ద్వారా గుర్తుపట్టనున్నారు.
Twitter: ట్విట్టర్ ను వెంటాడి మరి అంతు చూసిన కేంద్రం
మూడు వార్నింగ్ లేబుల్స్..
ఫేక్ మేసేజ్ లపై ముఖ్యంగా మూడు వార్నింగ్ లేబుల్స్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వక్రీకరించిన, తప్పుడు కంటెంట్ ను ఎవరైనా షేర్ (share)చేస్తే.. వెంటనే టేబుల్ జారీ అవుతుంది. వీడియో, ఆడియోను కావాలనే తప్పుడుగా ట్యాంపరింగ్ చేసి పోస్ట్ చేయడం, ఎలక్షన్కు రిలేటెడ్ సమాచారాన్ని తప్పుగా చూపిస్తే వార్నింగ్ లేబుల్ కనిపిస్తుంది. ఈ లేబుల్స్ ద్వారా ఇకపై ట్విట్టర్ లో ఫేక్ మెసేజ్ కాకుండా నాణ్యమైన కంటెంట్ ను పొందే చాన్స్ ఉంటుంది.