రాజధాని అమరావతి కుంభకోణం విషయంలో కీలక మలుపు ఈరోజు చోటు చేసుకుంది. రాజధాని కుంభకోణం వ్యవహారంలో ఇద్దరు కీలక వ్యక్తులను అరెస్ట్ చేసారు పోలీసులు. ఈ కేసులో గుమ్మడి సురేష్ ను, సుధీర్ బాబును అరెస్ట్ చేసారు.
అసైన్డ్ భూములు కొనుగోలు చేశాడన్న నెపంతో గుమ్మడి సురేష్ ను అరెస్ట్ చేయగా తుళ్లూరు రిటైర్డ్ తాసిల్దార్ సుధీర్ బాబును అరెస్ట్ చేసారు. టిడిపి నేతలతో చేతులు కలిపి రికార్డులు తారుమారు చేసిన కారణంగా సుధీర్ బాబును అరెస్ట్ చేసారు. మొత్తంగా రాజకీయ కుంభకోణం వ్యవహారం తీగ లాగితే డొంక కదులుతున్న చందంగా తయారైంది. ఇంకా ఈ కుంభకోణంలో ఎంతమంది ఉన్నారో తెలియాల్సి ఉంది. మరి చూడాలి ఎవరెవరు ఈ కుంభకోణం వెనకాల ఉన్నారో.