Sharukh khan : బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సినిమా వచ్చి దాదాపు మూడేళ్ళు అవుతోంది. బాలీవుడ్ లో ఆయన అభిమానులు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు కూడా షారుక్ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో షారుఖ్ ఇక గ్యాప్ రాకుండా రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని డిసైడయ్యాడు. అందులో భాగంగా ఈ ఏడాది అన్నీ అనుకున్నట్టు జరిగితే పఠాన్ సినిమా రానుంది. జీరో తర్వాత షారుక్ నుంచి వచ్చే సినిమా ఇదే కావడంతో భారీ అంచనాలున్నాయి. ‘పఠాన్’ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది.
ఆ తరువాత షెడ్యూల్ యూరప్ లో ప్లాన్ చేశారు. మళ్ళీ కరోనా వల్ల ఇబ్బందులు తలెత్తితే మాత్రం ఇండియాలోనే ‘పఠాన్’ పూర్తి చేసేలా కూడా నిర్మాత ఆదిత్య చోప్రా పక్కా ప్లాన్ తో ఉన్నాడట. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందుతోంది. యశ్ రాజ్ స్టూడియోస్ లో షారుఖ్ ఖాన్ జాయిన్ అయి షూటింగ్ చేస్తున్నాడు. ఇక పఠాన్ పూర్తి కాగానే ఒకేసారి రెండు సినిమాలను మొదలు పెడతాడట. తమిళ దర్శకుడు అట్లీ అలాగే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ తో కమిటయ్యాడు.
Sharukh khan : మహమ్మారి ఉధృతికి మన బాధ్షా అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవుతాయా
ఈ రెండు సినిమాలను షారుఖ్ మొదలు పెట్టబోతుండగా ముందు ఏ దర్శకుడితో చేయనున్నాడో త్వరలో వెల్లడిస్తాడట. ఈ సినిమాలను ఎటువంటి పరిస్థితుల్లోనూ 2022లో ప్రేక్షకుల ముందుకి తీసుకు రానున్నాడట. ఒకవేళ ‘పఠాన్’ ఈ ఏడాది రిలీజ్ చేసే వీలులేకపోతే గనక వచ్చే ఏడాది సమ్మేలోపు రిలీజ్ చేయనున్నారట. అంతేకాదు అట్లీ, రాజ్ కుమార్ హిరానీ సినిమాలతో 2022 సెకండ్ హాఫ్ లో రావడానికి ప్లాన్ చేస్తున్నాడు షారుఖ్. ఆయనకి బాగా కలిసి వచ్చే దివాళీ లేదా క్రిస్మస్ సందర్భంగా ఈ రెండు చిత్రాలను విడుదల చేస్తారట. మరి మహమ్మారి ఉధృతికి మన బాధ్షా అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవుతాయా లేదా చూడాలి.