టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు రాష్ట్ర బీజేపీ నేతలను టార్గెట్ చేస్తున్న సూచనలు గోచరిస్తున్నాయి.వారికి వ్యతిరేకంగా ఎల్లో మీడియాలో వార్తలు వస్తుండటమే ఇందుకు సాక్ష్యం అనిపిస్తోంది.
వీరిద్దరి వల్లే తాను మళ్లీ బీజేపీ అధినాయకత్వానికి దగ్గర కాలేకపోతున్నానన్న దుగ్ధ చంద్రబాబులో ప్రబలింది అంటున్నారు.బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ దేవధర్,ఏపీ కి చెందిన ఎంపీ జీవీఎల్ నరసింహారావులు చంద్రబాబుకు పెద్ద విలన్లుగా కనిపిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో బీజేపీతో పొత్తు తెగతెంపులు చేసుకోవడమే కాకుండా ఆ పార్టీని ప్రధాని మోడీని నోటికొచ్చినట్టు తిట్టిన ,బిజెపికి వ్యతిరేకంగా దేశమంతా కూటమి గట్టి మరీ ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడంటే బీజేపీలో చాలా వారికి కోపం ఉంది.జీవీఎల్ నర్సింహారావు అయితే చంద్రబాబంటే మండిపడతారు అన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు.అయితే ఏడాదిన్నర క్రితం జరిగిన ఏపీ ఎన్నికల్లో పూర్తిగా టిడిపి చతికిలపడిపోవడంతో చంద్రబాబు మళ్లీ బీజేపీ ముందు మోకరిల్లడానికి సిద్ధపడ్డారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచి ఆయన బిజెపి నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకోవటానికి చెయ్యని ప్రయత్నం లేదంటారు.ఆరెస్సెస్ నేతల ద్వారా మోడీకి తెప్పించుకోవటానికి కూడా చంద్రబాబు పాచికలు కదిపారట.ఒక దశలో టిడిపికి కొద్దిగా సానుకూల రెస్పాన్స్ బిజెపి నుండి వచ్చినప్పటికీ ఆ తర్వాత వాళ్లు మళ్లీ బిగుసుకుపోవడం వెనక సునీల్ దేవధర్ ,జీవీఎల్ నర్సింహారావు పాత్ర ఉందని చంద్రబాబు అనుమానిస్తున్నారు.అంతేగాక కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పుడు చంద్రబాబుతో కొంచెం సఖ్యతగా మెలిగేవారని టాక్.ఈ విషయాన్ని గ్రహించి కన్నా లక్ష్మీనారాయణను ఆ పదవి నుండి తప్పించి చంద్రబాబు అంటే విరుచుకుపడే సోము వీర్రాజుకి ఏపీ పార్టీ పగ్గాలు ఇప్పించింది కూడా వీరిద్దరేనన్నది చంద్రబాబు అంచనా.
అంతేగాక బిజెపిలో ఉన్న కొందరు టిడిపి కోవర్టుల విషయంలో సోము వీర్రాజు కఠినంగా వ్యవహరించటం కూడా చంద్రబాబుకు నచ్చడం లేదు.అయితే ఈ పరిణామాలను నీటికి మూలం సునీల్ దేవధర్ జీవీఎల్ నర్సింహారావులని బలంగా నమ్మిన చంద్రబాబు వారిద్దరిపైనా తన అనుకూల మీడియాలో బురద జలిస్తున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కొంతకాలం క్రితం జగన్ బావ బ్రదర్ అనిల్ జీవీఎల్ నర్సింహారావు బంధువని ఒక పుకారు లేపారు.తాజాగా తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చెయ్యడం వెనుక జగన్ తో కుమ్మక్కు రాజకీయం ఉందని రెండు మూడు రోజులుగా ఎల్లో మీడియా ఘోషిస్తోంది.ప్రతిపక్షం ఓట్లను చీల్చడం ద్వారా జగన్కు లబ్ధి చేకూర్చడానికి సునీల్ దియోధర్ జీవీఎల్ నరసింహారావులు ప్రయత్నిస్తున్నారంటూ ఆ పత్రికలు రాస్తున్నాయి. దీని ద్వారా వారిద్దరూ జగన్ నుండి భారీగా లబ్ధిపొందుతున్నట్లు కూడా దుష్ప్రచారం మొదలెట్టాయి.అయితే ఈ వార్తలు రాసేది మీడియా అయినా రాయించేది మాత్రం చంద్రబాబేనని రాజకీయ వర్గాలు బల్లగుద్ది చెబుతున్నాయి.