Murder: గుంటూరు జిల్లాలో ఘోరమైన నేరం జరిగింది.మానసిక స్థితి సరిగ్గా లేని సొంత బాబాయ్ చేతిలోనే చేతిలోనే ఇద్దరు చిన్నారులు హతమయ్యారు.రేపల్లె పట్టణంలో జరిగిన ఈ సంఘటన సంచలనం రేపుతోంది. అభం శుభం తెలియని చిన్నారులు అమ్మమ్మ ఇంటి వద్ద ఆడుకుంటున్న సమయంలో బాబాయి వరుస అయిన కాటూరి శ్రీనివాసరావు అనే సైకో ఇంటిలో తలుపులు మూసి వారిని చెక్క కర్రలతో కొట్టి దారుణంగా హత్య చేసిన ఈ ఉదంతం ప్రతి ఒక్కరినీ కదిలించివేస్తోంది.
పోలీసుల కథనం ఏమిటంటే!
రేపల్లె పట్టణ సీఐ సూర్యనారాయణ కథనం ప్రకారం పట్టణంలోని 23వ వార్డులో నివాసం ఉంటున్న మోర్ల విజయలక్ష్మి వద్ద ఆమె ఇద్దరు మనవలు కొద్దిరోజులుగా ఉంటున్నారు. చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామానికి కొండేటి కోటేశ్వరరావు,ఉమాదేవి దంపతులు తమ ఇద్దరు కుమారులైన పార్థివ్ సాహసవత్ (10),రోహిత్ తశ్విన్ (8)లను వారి అమ్మమ్మ అయిన మోర్ల విజయలక్ష్మి వద్ద ఉంచారు.ఈ దంపతులిద్దరూ బెంగుళూరులో ఉద్యోగం చేస్తుండగా కరోనా నేపధ్యంలో పిల్లలను అమ్మమ్మ ఇంటికి పంపారు. వారినిద్దరినీ ఉమాదేవి చెల్లెలి భర్త అయిన కాటూరి శ్రీనివాసరావు సోమవారం అతి దారుణంగా హత్య చేశాడు.ఇంటిలో ఆడుకుంటున్న ఆ పిల్లలను కర్రలతో కొట్టి శ్రీనివాసరావు అతి దారుణంగా చంపేశాడు.
Murder: పోలీసులకు లొంగిపోయిన హంతకుడు!
అనంతరం హంతకుడు శ్రీనివాసరావు తనంతట తాను నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు.ఈ ఘాతుకానికి పాల్పడ్డ శ్రీనివాసరావు బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం గ్రామానికి చెందిన వాడు. కాటూరి శ్రీనివాసరావు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో చాలాకాలంగా చికిత్స సైతం పొందుతున్నట్లు సమాచారం.అతను గతంలో కూడా అనేకసార్లు అత్యంత ఉద్రిక్తంగా ప్రవర్తించి బీభత్సం సృష్టించినట్లు సమీప బంధువులు చెబుతున్నారు.చివరకు ఉన్మాదిగా మారి ఇద్దరు పిల్లల ప్రాణాలు తీశాడు.అమ్మమ్మ విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.హృదయవిదారకమైన ఈ సంఘటన రేపల్లె పట్టణంలో నలుదిక్కుల దావాలనంలా వ్యాపించడంతో ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న హత్యగావించబడ్డ చిన్నారులను చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్నారు. రేపల్లె పట్టణంలో మొదటిసారిగా చిన్నారులను అతి దారుణంగా చంపడం ఇదే ప్రథమం కావడంతో ఈ విషయంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.