హైదరాబాద్: రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కాన్వాయ్ వాహనంలోని ఒక వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మంత్రి ఎర్రబల్లి క్షేమంగా బయటపపడ్డారు. ఈ ఘటన జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం చీటూరు గ్రామ సమీపంలో శనివారం అర్థరాత్రి జరిగింది.
మంత్రి దయాకర్రావు హైదరాబాద్ నుంచి పాలకుర్తికి వస్తుండగా ఆయన కాన్వాయ్లో వెనుక వస్తున్న వాహనం అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ పార్థసారధి (30) , సోషల్ మీడియా ఇన్ఛార్జి పూర్ణ(27) మృతి చెందారు. అదే వాహనంలో ఉన్న గన్మెన్ నరేశ్, అటెండర్ తాతారావు, శివ గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను జనగామ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మంత్రి దయాకర్రావు ఆస్పత్రికి చేరకుని క్షతగాత్రులను పరామర్శించారు.