Breaking: విశాఖ భీమిలి బీచ్ లో విషాదం చోటుచేసుకుంది. సరదాగా సముద్రంలో ఈతకు వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్ధుల్లో ఇద్దరు గల్లంతు అయ్యారు. తగరపువలస అనిట్స్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న అయిదుగురు విద్యార్ధులు శుక్రవారం భీమిలి బీచ్ కు వెళ్లారు. ఈత సరదా తీర్చుకునేందుకు వెళ్లగా సూర్య, సాయి అనే విద్యార్ధులు గల్లంతు అయినట్లు తోటి విద్యార్ధులు చెబుతున్నారు. మరో ముగ్గురు విద్యార్ధులు సురక్షితంగా ఒడ్డుకు చేరారు.
గల్లంతైన విద్యార్ధుల కోసం నేవీ, కోస్ట్ గార్డు సిబ్బంది హెలికాఫ్టర్ తో గాలింపు చర్యలు చేపట్టారు. బీచ్ దగ్గర తొలుత గజ ఈతగాళ్లుతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బీచ్ వద్దకు చేరుకున్న విద్యార్ధుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
జగన్ అక్రమాస్తుల కేసు .. హెటిరో సంస్థకు సుప్రీం కోర్టులో చుక్కెదురు