Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఫస్ట్ టైం పాన్ ఇండియా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా సినిమాకి సంబంధించి ప్రతి సన్నివేశం హైలెట్ గా ఉండేలా డైరెక్టర్ సుకుమార్ తో… ఒకటికి రెండు మూడు సార్లు చర్చిస్తూ పుష్ప సినిమా అద్భుతంగా వచ్చేలా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేయబోయే ప్రాజెక్టులకు సంబంధించిన వార్తల లో వచ్చిన వార్తల ప్రకారం.. లైన్ లో డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో.. ఐకాన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం ఇండియా లాక్ డౌన్ సమయంలో.. ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన నిర్మాత దిల్ రాజు చేయడం తెలిసిందే. అయితే ఇటీవల ఈ సినిమా ప్రాజెక్టు ఆగిపోయినట్లు వార్తలు రాగ వాటిలో వాస్తవం లేదని సినిమా ఉందని.. మేకర్స్ వచ్చిన రూమర్స్ నీ కొట్టిపారేశారు.
కాగా తాజాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీ లో వినపడుతోంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పూజా హెగ్డే రష్మిక మందన ఈ సినిమాలో బన్నీ సరసన నటించడానికి సిద్ధమైనట్లు త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఆల్రెడీ నీ పూజ హెగ్డే అలా వైకుంఠపురం లో అనే సినిమాలో అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ గా నటించగా… రష్మిక మందన ప్రస్తుతం చేస్తున్న పుష్ప హీరోయిన్ గా చేస్తుంది. మరోసారి ఈ ముద్దు గుమ్మలు బన్నీ సరసన ఐకాన్ మూవీ లో నటిస్తున్నట్లు లేటెస్ట్ టాక్.