WTC Final: నిన్న న్యూజిలాండ్ తో జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో భారత్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. కాబట్టి ప్రపంచ క్రికెట్లో మొట్టమొదటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ గా న్యూజిలాండ్ అవతరించింది. టీమిండియా రన్నరప్ హోదా తో సరిపెట్టుకుంది. అయితే రెండు సంవత్సరాలు అత్యద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన భారత్ పెద్ద స్టేజీపై బొక్క బోర్లా పడింది.
మ్యాచ్ ఫలితం వచ్చేసిన తర్వాత తప్పు ఎవరిది అని విశ్లేషించడం కరెక్ట్ కాకపోయినా భారత్ ఎక్కడ పొరపాటు చేసింది అన్న విషయంపై మాత్రం కచ్చితంగా ఆఫ్టర్-చెక్ చేసుకోవాల్సిందే. ఈ టెస్టు లో ఎక్కువ శాతం వర్షం ముప్పు ఉంది. ఇంగ్లాండ్ సాధారణంగానే పేసర్లకు భారీగా అనుకూలించే దేశం. అలాంటి చోట ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగడం భారత్ కు ప్రతికూలంగా మారిందని పలువురు వ్యాఖ్యాతలు చెబుతున్నారు.
న్యూజిలాండ్ ఒక వైపు నలుగురు ప్రధాన పేసర్లలతో బరిలోకి దిగితే భారత్ మాత్రం ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు తో మ్యాచ్ సిద్ధమైంది. అశ్విన్ అనుకున్నట్టుగానే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే జడేజా మాత్రం తీవ్రంగా నిరాశ పరిచాడు. సరే బౌలింగ్ కో కాకపోయినా బ్యాటింగ్లో ఉపయోగపడతాడు అనుకున్న జడేజా అక్కడ కూడా దారుణంగా విఫలం కావడం భారత్ విజయావకాశాలు ఘోరంగా దెబ్బ తీసింది.
అతని బదులు మహమ్మద్ సిరాజ్ జట్టులో ఉండి ఉంటే న్యూజిలాండ్ కు మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది ఉండేది కాదని పలువురు వాదిస్తున్నారు. సిరాజ్ ప్రధానంగా స్వింగ్ పైన ఆధారపడే బౌలర్ కాబట్టి విపరీతమైన కాన్ఫిడెన్స్తో లోకి వచ్చి ఉంటే ఫలితం మారేదని పలువురి వాదన. అంతే కాకుండా ప్రపంచ మేటి బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రెండు ఇన్నింగ్స్ లు కలిపి ఒక్క వికెట్ కూడా తీయకపోవడమే భారత్ పరాజయానికి మరొక కారణంగా చెప్పవచ్చు.
ప్రతిసారి బుమ్రా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఆశించడం తప్పు అయినప్పటికీ కనీసం ప్రపంచ మేటి ఫాస్ట్ బౌలర్ ఒక్క వికెట్ కూడా తీసుకోకపోవడంతో మిగిలిన బౌలర్లపై ఒత్తిడి పడి టీమ్ ఇండియా జట్టు పూర్తిగా వెనుకంజకు వెళ్లిపోయింది. ఇక ఇలాంటి తప్పులు ప్రధాన మ్యాచ్లలో జరిగితే వాటి వల్ల జరిగే నష్టం ఏ స్థాయిలో ఉంటుందో ఇప్పటికే అర్థం అయి ఉండవచ్చు కానీ భారత్ ఇలాగే ఎప్పటికే ప్రపంచ నెంబర్ వన్ గా ఉండాలంటే ఇలాంటి తప్పులు తదుపరి మ్యాచ్లలో జరగకుండా చూసుకోవడం మంచిది.