PMJJBY: జాతీయ బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన వారందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది! తద్వారా రెండు లక్షల రూపాయలు బ్యాంకు నుండి రాబట్టుకునే వీలుంది!కరోనా కారణంగా ప్రజలు అధిక సంఖ్యలో చనిపోతున్నారు.మనిషే పోయాక మనీ ఎందుకని చాలామంది అనుకుంటున్నారు. వారి వైద్యానికో మరోదానికో ఖర్చు పెట్టిన మొత్తంలో రెండు లక్షల రూపాయలు బ్యాంకు నుండి వచ్చే అవకాశం ఉండడాన్ని చాలామంది గుర్తించటం లేదు. ఇదేమీ చిన్నమొత్తం కాదు. కేవలం చిన్నపాటి ఎంక్వైరీ ద్వారా ఈ మొత్తాన్ని బ్యాంకు నుండి పొందవచ్చు!
PMJJBY: మ్యాటర్ ఏంటంటే!
2015 సంవత్సరం నుండి జాతీయ బ్యాంకుల పొదుపు ఖాతాదారులకు భారత ప్రభుత్వం రెండు సరసమైన భీమా పథకాలను అందించింది.ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పిఎంజెజెబివై) కింద సంవత్సరానికి రూ .330, ప్రధాన్ మంత్రి స్వస్థ సూరక్ష బీమా యోజన (పిఎంఎస్బివై) కింద సంవత్సరానికి 12 రూపాయలు చెల్లించితే ఆ ఖాతాదారుడు మరణించినప్పుడు రెండు లక్షల రూపాయలు ఇచ్చే భీమా పథకాలు ఇవి. ఒకసారి ఖాతాదారులు ఈ పథకంలో చేరినట్లయితే ఆటోమెటిగ్గానే ప్రతి ఏడాది వారి ఖాతా నుండే ఈ మొత్తం బీమా పథకాలకు చెల్లింపు జరిగిపోతుంది.చెల్లింపుల వివరాలన్నీ బ్యాంకులో ఉంటాయి.
ఇప్పుడెలా అవి ఉపయోగపడతాయి?
ఎవరి దగ్గరి బంధువైనా, పరిచయస్తుడైనా ఇటీవల మరణించినట్లయితే (మరణం ఏ కారణం వల్లనైనా సంభవించి ఉండొచ్చు)వెంటనే సదరు మృతుని బ్యాంకు ఖాతా వివరాలు పరిశీలించండి.ఒకవేళ వారి ఖాతాల నుండి 01 ఏప్రిల్ 2020నుండి 31 మార్చి 2021 మధ్య బ్యాంక్ వారి పాస్బుక్ ఎంట్రీలో 12 రూపాయలు లేదా 330 రూపాయలు తగ్గించినట్లు ఉందేమో గమనించండి. తగ్గిస్తున్నట్లు పాస్ బుక్కులో ఉంటే వెంటనే మృతుని తరపు వారసులు ఆ బ్యాంకుకు తమకు బీమా పథకం కింద రెండు లక్షల రూపాయలు ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకోండి. అయితే ఖాతాదారులు మరణించిన తొంభై రోజుల్లోపే ఈ ప్రక్రియ పూర్తి చేయాలి.ఆ దరఖాస్తు అందుకున్న బ్యాంకు వారు తప్పనిసరిగా రెండు లక్షల రూపాయలు బీమాను వృత్తులు వారసులకు చెల్లించాల్సిందే.కరోనా కష్టకాలంలో వేన్నీళ్ళకు చన్నీళ్ళుగా ఉపయోగపడే ఈ పథకం గురించి తెలుసుకోండి !త్వరపడండి !బ్యాంకుల నుండి బీమా సొమ్ములు పొందండి!