నరసాపురం వైసిపి ఎంపి రఘురామకృష్ణంరాజు బయటపడ్డాడు గాని మరికొందరు ఆ పార్టీ ఎంపీలు కూడా లోలోపల తమకు పార్టీలో ప్రాధాన్యం లేదని ఫీలవుతున్నట్లు లీకులు వస్తున్నాయి .
తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి, నెల్లూరు పార్ల మెంటు సభ్యుడు ఆదాల పభాకర్రెడ్డిలు ఇద్దరూ కూడా తీవ్ర అసంతృప్తితో రగిలి పోతున్నారనే ప్రచారంసాగుతోంది. తమకు జిల్లాలో ఎవరూ సహకరించడం లేదని, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని కూడా వారు ఫీలవుతున్నారట..సీఎం జగన్తో మాట్లాడదామంటే ఆయన అప్పాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితిలో వారుతమలో తామే కుమిలిపోతున్నారని పరిశీలకులు చెబుతున్నారు
ఇటు, ప్రకాశంలోను, అటు నెల్లూరులోనూ రెడ్డి సామాజిక వర్గం హవా ఎక్కువగా నడుస్తోంది.ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాస్రెడ్డి, నెల్లూరులో మేకపాటి గౌతంరెడ్డి వంటి కీలక నేతలు చక్రం తిప్పుతున్నారు. దీంతో తమకు కూడా ప్రాధాన్యం దక్కుతుందని, ఎంపీలు మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ప్రభాకర్రెడ్డిలు భావించారు. కానీ, అది జరగడం లేదు .ఇటు ఆదాల ,అటు మాగుంట మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఎన్నికలకు ముందు.. టీడీపీ నుంచి వచ్చి వైసీపీలో చేరారు. ఆవెంటనే గెలిచారు. అయితే వారికి పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న నాయకులకు మధ్య కెమిస్ట్రీ కుదరలేదు. దీంతో వారిని ఎవరూ పట్టించుకోవడం లేదు.
ప్రకాశం జిల్లాలో జిల్లాలో మంత్రులు అయిన బాలినేని శ్రీనివాసుల రెడ్డి, ఆదిమూలపు సురేష్ హవా ఎక్కువగా ఉండడం.. దిగువ శ్రేణి నాయకులు కూడా మంత్రుల కనుసన్నల్లోనే నడుస్తుండడంతో మాగుంట పరిస్థితి డోలాయమానంగా మారింది. ఓ ఎంపీగా ఉండి చిన్నపని కూడా చేయించుకునే పరిస్థితి లేదట. ఒక వేళ తాను ఏదైనా చిన్న పని చేయించుకోవాలన్నా మంత్రులో లేదా, ఎమ్మెల్యేలనో అడగాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారట. ఇక, ఆదాల ప్రభాకర్రెడ్డి పరిస్తితి కూడా డిటో ఇలానే ఉందని అంటున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక ఈయన కూడా తర్జన భర్జన పడుతున్నారు.
దీంతో ఈ ఇద్దరు ఎంపీలు మానసికంగా నలిగిపోతున్నారని అంటున్నారు పరిశీలకులు. మరి ఇప్పటికైనా సీఎం జగన్ పట్టించుకుంటేనే పరిస్థితి బెటర్ అవుతుందని సూచిస్తున్నారు. ముఖ్యంగా మంత్రులందరూ ఎంపీలను కలుపుకొని పోయేలా వారికి కూడా ప్రాధాన్యం దక్కేలా ఆదేశాలు ఇస్తే.. సమస్యలు లేకుండా పోతాయని అంటున్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజు తెచ్చిన తలనొప్పి తోనైనా జగన్ గుణపాఠం నేర్చుకుని పార్టీ ఎంపీలందరికీ పెద్దపీట వేయడం ఎంతైనా అవసరమని రాజకీయ పరిశీలకు సూచిస్తున్నారు.