KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సొంత పార్టీ నేతలే బీపీ పెంచుతున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య మధ్య విబేధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు ఉప ముఖ్యమంత్రుల మధ్య మరోమారు విబేధాలు బయటపడ్డాయి. ఒకరిపై మరొకరు కామెంట్లు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది.
Read More: KCR: గల్లీలో కొట్లాట… ఢిల్లీలో ఒకే మాట అంటున్న కేసీఆర్ , జగన్
కడియంను అంత మాట అనేశారు….
పదవీ కాలం ముగిసినా కడియం శ్రీహరి ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనడం ఏంటని ఎమ్మెల్యే రాజయ్య ప్రశ్నించారు. రాజయ్య వ్యాఖ్యలపై కడియం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సేవ చేయడానికి పదవులు,ప్రోటోకాల్ అవసరం లేదని కడియం పేర్కొన్నారు. స్టేషన్ ఘనపూర్ లో CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కడియం శ్రీహరి.. ఎమ్మెల్యే రాజయ్య వాఖ్యలు సరికాదన్నారు. జూన్ 2తో తన పదవీకాలం ముగిసింది.. నియోజకవర్గానికి రావడానికి ఎవరి లైసెన్స్, అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
Read More: KCR: కేసీఆర్ మంత్రులకు చెప్పుదెబ్బలే…షర్మిల పార్టీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
అందుబాటులోనే ఉంటా…
రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు పదవి ఉన్నా.. లేకున్నా అందుబాటులో ఉండిసేవ చేయడమే తన లక్ష్యమని కడియం శ్రీహరి తెలిపారు. అంతేకాదు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. దేవాదుల సాగునీరు గురించి మాట్లాడని వారు, దేవాదులపై అవగాహన లేనివారు కూడా హడావుడి చేయడం విడ్డురంగా ఉందని కడియం శ్రీహరి విమర్శించారు. మరోవైపు ఈ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం చర్చకు దారి తీస్తోంది.