దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలు ముగిశాయి. 8 రాష్ట్రాల్లో 19 సీట్లకు గానూ ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగగా ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రాజ్యసభ సీట్లకు పోలింగ్ జరిగింది. 151 అసెంబ్లీ స్తానాలు కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి సందేహం లేకుండా నాలుగు రాజ్యసభ స్థానాలను దక్కించుకోనున్న విషయం అందరికీ తెలిసిందే.
ఇక 23 మంది ఎమ్మెల్యేలు కలిగిన తెలుగుదేశం పార్టీ పోలింగ్ కి ముందు విప్ ను జారీ చేయగా కచ్చితంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే వచ్చి ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మొత్తం 175 ఎమ్మెల్యే గాను కేవలం 173 ఎమ్మెల్యేలే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటింగ్ కు హాజరు కాలేకపోవడం గమనార్హం.
వారి లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన కారణంగా తాను వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని చంద్రబాబు కి లేఖ రాయగా… రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తాను సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నందువల్ల ఓటింగ్ కు రాలేను అని తెలియజేశారు. ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కానుండగా 6 గంటలకు ఫలితాలు వెల్లడిస్తారు.