సాయి పల్లవి కి టాలీవుడ్ లో ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. సజహమైన నటనతో ప్రేక్షకులని ఫిదా చేసింది. మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ తో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయిన సాయి పల్లవి ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా తో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ సినిమా తర్వాత తెలుగు చిత్రపరిశ్రమలో వరుస అవకాశాలతో దూసుకెళుతుంది.
‘ఎంసీఏ’, ‘పడి పడి లేచే మనసు’, ‘కణం’ చిత్రాలతో నటించిన సాయి పల్లవి తనకి వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఒపుకోవడం లేదు. కథ.. అందులో తన పాత్ర బావుంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. రెమ్యూనరేషన్ భారీగా ఇస్తామన్నా.. కథ నచ్చకపోతే ఆ సినిమాలో స్టార్ హీరో ఉన్నా ఏమాత్రం ఆలోచించకుండా రిజెక్ట్ చేస్తుంది. అయినా సాయి పల్లవి అంటే మేకర్స్ క్యూ కడుతున్నారు.
ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్యతో లవ్ స్టోరీ అన్న సినిమా చేస్తుంది ఈ ఫిదా బ్యూటి. అలాగే దగ్గుబాటి రానా ‘విరాటపర్వం’ సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలతో సాయి పల్లవి మరో సారి తన రేంజ్ ఏంటో చూపించబోతుంది. అయితే శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం జీ5, తో పాటు అమెజాన్ ప్రైమ్ పోటీ పడుతున్నాయట. ఇదంతా సాయి పల్లవి క్రేజ్ అని చెప్పుకుంటున్నారు.
ఇక రానా దగ్గుబాటి తో నటిస్తున్న విరాట పర్వం సినిమాలో సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించబోతుంది. అలాగే టాక్సీవాలా ‘ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని కి జంటగా ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ చిత్రంతో సాయిపల్లవి రెమ్యునరేషన్ భారీగా పెరిగినట్లు ఒక వార్త సినివర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది.