బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తుపాకీ కాల్పుల కలకలం రేగింది. రావులపాలెంలో తుపాకీ మోతలు స్థానికులను ఆందోళనకు గురి చేశాయి. రావులపాలెంకు చెందిన ఫైనాన్స్ వ్యాపారిపై గుడిమెట్ల సత్యనారాయణ రెడ్డిపై అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో సత్యనారాయణ రెడ్డి కుమారుడు ఆదిత్యారెడ్డి ప్రతిఘటించడంతో దుండగులు గాలిలోకి కాల్పులు జరిపారు. తండ్రి కొడుకులు పెద్దగా కేకలు వేయడం, కాల్పుల మోతకు చుట్టుపక్కల వారు అక్కడకు రావడంతో దుండగులు పరారైయ్యారు. ఇద్దరు దుండగులు పారిపోతున్న సమయంలో ఒక వ్యక్తి చేతిలోని సంచీ జారి అక్కడ కింద పడిపోయింది.
దుండగులు వెళ్లిపోయిన తర్వాత ఆ సంచిని పరిశీలించగా, అందులో రెండు నాటు బాంబాలు, జామర్ ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఫైనాన్స్ వ్యాపారి వద్ద డబ్బులు తీసుకున్న వాళ్లే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే దుండగులు తుపాకీ, నాటు బాంబులు, జామర్ కల్గి ఉండటంతో ఈ అంశాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకుని విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పారిపోయిన దుండుగుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?