25.7 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Video Viral: మున్సిపల్ పారిశుద్య కార్మికులపై దూసుకువెళ్లిన కారు .. ఇద్దరు మహిళలు మృతి, మరో నలుగురుకి తీవ్ర గాయాలు

Share

Video Viral: కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు మహిళా మున్సిపల్ పారిశుద్య కార్మికులు అసువులు బాశారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మెదక్ జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం జరిగింది. ఈ ప్రమాద ఘటన సమీపంలోని పెట్రోల్ బంక్ సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే .. పట్టణంలో పారిశుద్ద్య విదులు నిర్వహించేందుకు కార్మికులు ఉదయం కార్యాలయానికి వెెళుతున్నారు. ఈ సమయంలో హైదరాబాద్ వైపు వెళుతున్న కారు అతివేగంగా వారిపై దూసుకువెళ్లింది. దీంతో దాయరవీధికి చెందిన నరసమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, యాదమ్మ అనే మహిళా కార్మికురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు.

Road Accident

స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న డీఎస్పీ సైదులు, సీఐ మధు, రూరల్ సీఐ విజయ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు మహిళా కార్మికుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కాారణమైన కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కారును స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. డ్రైవర్ నిర్లక్ష్యంపై నెటిజన్ లు మండిపడుతున్నారు.


Share

Related posts

Vijay Sethupathi: మరొక తెలుగు టాప్ హీరోకి విలన్ గా విజయ్ సేతుపతి!!

Naina

Rahul Gandhi: ఏపీ కాంగ్రెస్ కు జవసత్వాలు నింపే పనిలో రాహుల్!రేవంత్ తరహా నేత కోసం గాలింపు!

Yandamuri

Telangana MLC election Counting: నేడే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్..! ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ..!!

somaraju sharma