Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్ కోర్టు వద్ద పలువురు దాడికి పాల్పడ్డారు. టైలర్ కన్నయ్య కుమార్ దారుణ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నాయకురాలు నుపూర్ శర్మ అభ్యంతరకర వ్యాఖ్యలను సమర్ధించిన కారణంగా టైలర్ కన్నయ్య కుమార్ ను రియాజ్ అక్తరీ, గౌస్ మహమ్మద్ లు పట్టపగలు అత్యంత దారుణంగా హత్య చేశారు. వారు ఈ ఘటనను చిత్రీకరించడంతో పాటు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తాము గొప్పపని చేసినట్లుగా మహమ్మద్ ప్రవక్తను కించపరిచినందుకు ప్రతీకారం తీర్చుకున్నాము, ప్రధాన మంత్రి మోడీని కూడా బెదిస్తూ సందేశంలో పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనతో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అక్కడి అధికారులు నెల రోజుల పాటు నిషేదాజ్డలు విధించారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకి అప్పగించింది. నిందితులు ఇద్దరూ ఉగ్రవాద శిక్షణ పొందిన వారిగా ఎన్ఐఏ గుర్తించింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కన్నయ్య కుమార్ ను హత్య చేయడంలో రియాజ్, గౌస్ విఫలమైతే దాడి చేసేందుకు స్టాండ్ బై గా మొహిన్, ఆసీఫ్ అనే ఇద్దరు అక్కడే ఉన్నట్లుగా ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడి కావడంతో వారిద్దరిని గురువారం అరెస్టు చేశారు. నిందితులను భారీ భద్రత నడుమ ఎన్ఐఏ అధికారులు జైపూర్ కోర్టులో హజరుపర్చారు. ఈ క్రమంలో కోర్టు ఆవరణలో గుమిగూడిన ప్రజలు నిందితులపై దాడికి పాల్పడ్డారు. న్యాయవాదులు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కన్నయ్య హంతకులను మరణ శిక్ష విధించండి, పాకిస్థాన్ ముర్దాబాద్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. కోర్టు ప్రాంగణంలో నిందితులపై ప్రజలు దాడి చేయడంతో అప్రమత్తమైన పోలీసులు వారికి హని కలగకుండా వెంటనే వ్యాన్ లోకి ఎక్కించి రక్షించారు. కాగా, కోర్టు ఈ నిందితులను జూలై 12 వరకూ ఎన్ ఐ ఏ కస్టడీకి అప్పగించింది.,
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?