Big Breaking: ఆప్ఘనిస్థాన్ లో తాలిబన్ల అరాచకాలు ఎక్కువవుతున్నాయి. ఆ దేశంలో విదేశీయులను తమ దేశాలకు వెళ్లిపోవాలంటూ తాలిబన్లు హెచ్చరించారు. దీంతో చాలా మంది తమ తమ దేశాలకు వెళ్లిపోతున్నారు. ఈ నేపధ్యంలో ఉక్రేనియన్ ప్రజలను తీసుకెళ్లడానికి ఉక్రేనియన్ విమానం వెళ్లేందుకు సిద్దమవ్వగా ఆ విమానాన్ని గుర్తుతెలియని వారు హైజాక్ చేశారు. ఆ విమానాన్ని ఆప్ఘనిస్థాన్ కు తీసుకెళ్లకుండా వారు ఇరాన్ కు తీసుకెళ్లారు.
Oats: డయాబెటిస్, రక్తపోటు, అధిక బరువు ఉన్నవారు ప్రతిరోజు ఇవి గుప్పెడు తింటే చాలు..!!
తాలిబన్ల అరాచకారాల వల్ల కాబూల్ నుంచి విమాన సర్వీసులన్నింటినీ ఆపేశారు. ఉక్రేన్ విమానం హైజాక్ అవ్వడంతో ఆ దేశ సిబ్బంది అలర్ట్ అయ్యారు. విమానంలో ఉన్నవారు తమకు తెలియడం లేదని ఉక్రేన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి వెల్లడించారు. ఆ విమానాన్ని ఎలా హైజాక్ చేశారనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం హైజాక్ గురైన విమానాశ్రయం అమెరికా ఆధీనంలో ఉంది. 600 మంది అమెరికా సిబ్బంది ఆ ఎయిర్ పోర్టులో పని చేస్తున్నారు. అయినా ఇలా ఎలా జరిగిందోనని అమెరికా, నాటో దళాలు తెలుసుకోలేకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?