Ukrine Crisis: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో మాట్లాడారు. దాదాపు 35 నిమిషాలు మోడీ ఆయనతో మాట్లాడారు. ఓ వైపు యుద్ధం జరుగుతున్నప్పటికీ శాంతి చర్చల నిర్ణయం తీసుకోవడంపై జెలెన్ స్కీ ని ప్రధాని మోడీ అభినందించారు. అంతే కాకుండా భారతీయుల తరలింపు విషయంలో ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు మోడీ. తరువాత ప్రస్తుత యుద్ధ పరిస్థితులపై ఇద్దరూ చర్చించుకున్నారు. రష్యా కాల్పుల విరమణ ప్రకటించిన నేపథ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత విద్యార్ధుల తరలింపు వేగవంతం చేయాలనీ, అందుకు సహకరించాలని జెలెన్ స్కీని మోడీ కోరారు.
Ukrine Crisis: ఉక్రెయిన్ లో తాజా పరిస్థితులపై
ప్రత్యేకంగా సుమీ భారతీయుల తరలింపు క్లిష్టంగా మారిన కారణంగా అక్కడ ప్రత్యేకంగా దృష్టి సారించాలని మోడి కోరారు. ఇప్పటికే చాలా వరకు భారతీయులను స్వదేశాలకు తరలించారు. అయితే సుమీ రీజియన్ లో చిక్కుకున్న వారిని తరలింపు కష్టసాధ్యంగా మారిన తరుణంలో మోడీ దీనిపై ప్రత్యేకంగా జెలెన్ స్కీతో మాట్లాడారు. అదే విధంగా ఉక్రెయిన్ లో నెలకొన్న తాజా పరిస్థితులపై కూడా మోడీ జెలెన్ స్కీని అడిగి తెలుసుకున్నారు.
చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మోడీ అటు రష్యా అధ్యక్షుడు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి సూచించారు. ఆపరేషన్ గంగ పేరుతో భారత్ ప్రత్యేక విమానాల ద్వారా ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుండి భారత విద్యార్ధులు, పౌరుల తరలింపు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గత 14 రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా యుద్దం చేస్తోంది. అయితే వివిధ దేశాల సహకారంతో ఉక్రెయిన్ ధీటుగా యుద్దం చేస్తున్నా పలు ప్రధాన నగరాలను రష్యా ఆక్రమించింది.