ఎన్.టి.ఆర్ కెరీర్ లో నటించబోతున్న 30 వ సినిమా నుంచి సర్ప్రైజింగ్ అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ పోరాట యోధులుగా తెరకెక్కుతున్న సినిమా రౌద్రం రణం రుథిరం. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా కేటగిరీలో ఈ సినిమాని నిర్మిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, అజయ్ దేవగన్, శ్రియ శరణ్, ఓలియా మోరిస్..ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
కాగా ఆర్ ఆర్ ఆర్ లో కొమరం భీం గా నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తన 30 వ సినిమాని మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ తో చేయబోతున్న సంగతి తెలిసందే. ఈ సినిమాని త్రివిక్రం పాన్ ఇండియా రేంజ్ లో రూపొందిస్తున్నారు. హారిక అండ్ హాసిని, ఎన్.టి.ఆర్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా సర్ప్రైజింగ్ అప్డేట్ వచ్చింది. త్వరలో ఎన్.టి.ఆర్ 30 ని మొదలు పెట్టబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా మేకర్స్ వెల్లడించారు. విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి లేదా మార్చ్ మొదటి వారం నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతోందని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించే అవకాశాలున్నాయని సమాచారం. ఎన్.టి.ఆర్. ఈ సినిమా తర్వాత మైత్రీ మూవి మేకర్స్ లో ఒక చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. కే.జీ.ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే సినిమా కూడా పాన్ ఇండియా కేటగిరీలోనే తెరకెక్కబోతుండగా ఈ ఏడాది చివరిలో సెట్స్ మీదకి వస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. సంక్రాంతి తర్వాత ప్రభాస్ తో సలార్ సినిమాని మొదలు పెడుతున్నాడు.