మాజీమంత్రి అచ్చెన్నాయుడు కు ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి దాదాపు ఖరారై పోయిందంటున్నారు. ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొని పార్టీని ముందుకు నడిపించే సత్తా ఉన్నబాబాయికి అందులో అబ్బాయికి నచ్చడం లేదా
నాయకుడని టిడిపి అధినేత చంద్రబాబు నమ్ముతున్నారు.జగన్ పై రాజకీయంగాను, వ్యక్తిగతంగానూ. ఘాటు విమర్శలు చేసే విషయంలో అచ్చెన్న వ్యవహార శైలి, ఇవన్నీ టీడీపీకి కలిసొచ్చే అంశాలు గానే చంద్రబాబు భావిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాదు నుంచి ఏపీకి చంద్రబాబు వచ్చినా ఆయన రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉండే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.ఈ పరిస్థితుల్లో బలమైన వాయిస్ కలిగిన అచ్చెనాయుడైతే టిడిపికి అన్ని విధాలా సరిపోతారని చంద్రబాబు అంచనా.కానీ పార్టీ వర్గాల వాదన ఇందుకు భిన్నంగా ఉంది.
ఆవేశంగా ప్రత్యర్థులపై విమర్శలతో ఇరుకున పెట్టే విధంగా అచ్చెన్న చేయగలరేమో గాని, పార్టీని నడిపించే అంతటి సామర్ధ్యం ఆయనకు లేదనేది శ్రేణుల్లో ఉన్న అభిప్రాయం.అసలు అధ్యక్షుడు గా అచ్చెన్న నాయుడు చంద్రబాబు తరహాలో నడిపించగలడా ? శ్రేణులను ఏకతాటిపైకి తీసుకువచ్చి, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లగలడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.ఇంకా బయటకొచిన మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే అచ్చెన్నాయుడుకి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడం అనేది ఆయన కుమారుడు శ్రీకాకుళం ఎంపీ అయిన రామ్మోహన్ నాయుడు కూడా నచ్చడం లేదట.
ఆయన వ్యవహార శైలి పూర్తిగా తెలిసిన రాంమోహన్ నాయుడు బాబాయి విషయంలో పెదవి విరుస్తున్నారట.పైగా పార్టీని పునర్జీవి౦పచేయడానికి యువ రక్తాన్ని నింపడానికి బదులు వృద్ధ తరానికి పెద్దపీట వేయడం పార్టీ శ్రేణులను నిరుత్సాహ పరుస్తుందని రామ్మోహన్ నాయుడు భావిస్తున్నారట.ఈ విషయాలన్నీ నేరుగా చంద్రబాబు నాయుడుకే నివేదించాలని ఆ యువ ఎంపీ సిద్ధపడుతున్నారట. మొత్తం మీద చూస్తే అచ్చెనాయుడు,రామ్మోహన్ నాయుడు కు మధ్య పొరపొచ్చాలు ఉన్నాయని, అవి త్వరలోనే బయటపడగలవని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.