కన్న కొడుకు జీవితం బాగుండాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు. ఈ నేపథ్యంలోనే చత్తీస్ఘడ్ రాష్ట్రం, బిలాస్ పూర్ గ్రామం కృష్ణ రాజపుత్ సింగ్ కు గౌతమ్ రాజ్ పుత్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే గత రెండేళ్ల క్రితం గౌతమ్ రాజ్ పుత్ కి ఆర్తి సింగ్ అనే యువతితో వివాహం చేశాడు. వీరి వివాహ జీవితం ఎంతో అన్యోన్యంగా గడుపుతున్న సమయంలో ఒక ప్రమాదవశాత్తు గౌతమ్ రాజ్ పుత్ మరణించారు. అప్పటి నుంచి తన కోడలు ఆర్తి సింగ్ తన భర్త ఇంట్లోనే నివాసం ఉంటుంది.
గౌతమ్ రాజ్ పుత్ కుటుంబం రాజుల వంశానికి చెందినది కనుక ఆ కుటుంబంలోని ఆడవారు పెద్దగా బయట తిరగరు. అందువల్ల ఆర్తి సింగ్ గౌతమ్ రాజ్ పుత్ ఇంట్లోనే నివాసం ఉండేది. అయితే ఒకరోజు ఆర్తి సింగ్ ను తన మామ వివాహం చేసుకోవటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు ఏం జరిగిందంటే…
కొడుకు మరణించిన తర్వాత కోడలను సొంత కూతురు లాగా చూసుకోవాల్సిన మామే, ఆమెను పెళ్లి చేసుకోవడం ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కాకపోతే క్షత్రియ వంశస్థులైన రాజ్ పుత్ కుటుంబం వారి కుటుంబ ఆచారాల ప్రకారం భర్త చనిపోయిన మహిళలు తిరిగి రెండో వివాహం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆర్తి సింగ్ కూడా వివాహం చేసుకోవలసిందిగా కుటుంబ సభ్యులు ఆమెను కోరారు. మరొక వివాహం చేసుకోవడానికి ఆర్తి సింగ్ కూడా అంగీకరించింది.
ఇదే విషయాన్ని కృష్ణ రాజ్ పుత్ సింగ్ క్షత్రియ మహాసభల ముందుకు తీసుకు రావడంతో, తన కోడలను తనే వివాహం చేసుకుంటానని చెప్పడంతో, అందుకు ఆర్తి సింగ్ కూడా తనను రెండేళ్లుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా తనని చూసుకుంటున్న తీరు నచ్చడంతో తన మామ కృష్ణ రాజ్ పుత్ ను వివాహం చేసుకోవడానికి అంగీకరించింది. అయితే వీరిద్దరి వివాహం క్షత్రియ ఆచార సాంప్రదాయ ప్రకారం అతికొద్ది మంది సమక్షంలో జరిగింది. అయితే ప్రస్తుతం ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం తెలుసుకున్న కొందరు నెటిజన్లు ఇదేం విడ్డూరం అన్నట్టు తమదైన శైలిలో వ్యవహరిస్తున్నారు.