NewsOrbit
న్యూస్

జగన్ మీద కాదు ! ఉండవల్లి కోపం మొత్తం విజయసాయిరెడ్డిపై !!

దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి అత్యంత సన్నిహితుడైన రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నిన్నమొన్నటి వరకు జగన్ను వైసీపీని సమర్థిస్తూనే వచ్చారు.అకస్మాత్తుగా ఆయన స్వరం మారిపోయింది.పలు విమర్శలతో కూడిన గొంతు బయటపడింది.ఉండవల్లి కోపమంతా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపైనేనని ,దాన్నంతా జగన్ పైన చూపారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.


రాష్ట్రంలో పిచ్చి పిచ్చి మద్యం బ్రాండులు అన్నీ అమ్ముతున్నారని, బూమ్ బూమ్, జాం జాం అనే బ్రాండులు వచ్చేసాయి అని ఉండవల్లి అన్నారు. పెద్ద కంపెనీలను ఎందుకు రానివ్వటం లేదు, ఈ పిచ్చి కంపెనీలు ఎందుకు వచ్చాయి అనే విషయం పై, వివరాలు సేకరిస్తున్నా అని, దీని పై త్వరలోనే పూర్తి వివరాలతో వస్తానని అన్నారు. అలాగే జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత, పగ తీర్చుకునే విధంగా ప్రవర్తించటం సబబు కాదని అన్నారు. ప్రత్యర్దులని నిర్ములించటానికి, కక్ష తీర్చుకోవటానికి కాదు, ప్రజలు మిమ్మల్ని గెలిపించింది అని అన్నారు. అలాగే నిమ్మగడ్డ పై, కులం విషయంలో జగన్ మోహన్ రెడ్డి, ప్రెస్ మీట్ పెట్టి మరీ తిట్టటం పై, ఉండవల్లి ఆక్షేపించారు. ఈ రోజు నిమ్మగడ్డ చేసిందే కరెక్ట్ అయ్యింది కదా, ఈ రోజు కరోనాతో అన్నీ ఆగిపోయాయి కదా అని ఉండవల్లి అన్నారు. ఆలాగే కోర్టుల పై వైసిపీ శ్రేణులు ఇష్టం వచ్చినట్టు చేస్తున్న వ్యాఖ్యల పై కూడా ఉండవల్లి స్పందించారు. జడ్జిలను ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ ఉంటే, వారు ఎందుకు ఊరుకుంటారు అని ఉండవల్లి అన్నారు. 

ప్రభుత్వాలు తప్పు చేస్తే కోర్టులు సరిదిద్దే బాధ్యత ఉందని అన్నారు. బూతులు తిట్టిన వారికి నోటీసులు ఇస్తే, మేము చూసుకుంటాం, ఇవన్నీ మాకు మాములే అంటూ, వైసిపీలో ఉన్న ఒక పెద్ద నేత చెప్తున్నారు అంటే, ఇంకా ఏమి చెప్పాలి ? అంటే దీని వెనుక మా పార్టీ ఉందని మీరే ఒప్పుకున్నారా అని ఉండవల్లి ప్రశ్నించారు. అధికారం శాశ్వతం అని జగన్ మోహన్ రెడ్డి అనుకుంటే, అంతకంటే పిచ్చి తనం లేదని ఉండవల్లి అన్నారు. అలాగే బడ్జెట్ పై ఉండవల్లి మాట్లాడుతూ, కేవలం జగన్ ఇచ్చిన హామీలకే, 84 వేల కోట్లు, ఏడాదికి అవుతుందని, ఇక జీతాలు, పెన్షన్లు అధికం అని, మరి ఈ డబ్బులు ఎలా తెస్తారని ఉండవల్లి ప్రశ్నించారు ? అలాగే పార్టీ మారిన వాళ్ళు అందరూ తనతోనే ఉంటారని జగన్ అనుకుంటున్నారేమో, మొన్న ఆ పార్టీలో ఎలా మాట్లాడారో, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నారుగా, ఎవరూ శాశ్వతం కాదని ఉండవల్లి అన్నారు.ఏదేమైనా మారిన ఉండవల్లి స్వర౦ దేనికి సంకేతం అన్న విషయమై రాజకీయ వర్గాల్లో లోతుగా విశ్లేషణ జరుగుతోంది!

author avatar
Yandamuri

Related posts

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju