ఇటీవలే జాతీయ సమగ్రతకు భంగం వాటిల్లుతోంది అన్న కారణంగా ప్రముఖ గేమింగ్ యాప్ పబ్జీను భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన విషయం తెల్సిందే. అయితే ఇలా పబ్జీ బ్యాన్ అయిందో లేదో, ఆ తరహా కొత్త గేమ్ ను భారత్ లో ప్రవేశపెడుతున్నారు. ఎన్ కొర్ గేమ్స్ రూపొందించిన ఈ ఫౌజీ గేమ్ పబ్జీకు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ గేమ్ రూపకల్పన చేసినట్లు తెలిపారు. అక్షయ్ కుమార్ ఈ విషయాన్ని తెలియజేస్తూ వినోదంతో పాటు మన సైనికులు చేసిన త్యాగాలకు కూడా ఈ గేమ్ నిదర్శనంగా నిలుస్తుందని అన్నాడు. అలాగే ఈ గేమ్ ద్వారా వచ్చిన నెట్ లాభాల్లో 20 శాతాన్ని భారత్ కె వీర్ ట్రస్ట్ కు డొనేట్ చేయనున్నట్లు తెలిపాడు.