Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ మల్టీ స్టార్ మూవీ “RRR” బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి నెలలో విడుదలై దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. చరణ్, ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ కి థియేటర్ లు దద్దరిల్లాయి. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీకి హాలీవుడ్(Hollywood) నటీనటులు దర్శకులు పొగడ్తలతో ముంచేత్తుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు దేశంలో మరో బిగ్ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనుంది అని సరికొత్త వార్త వినపడుతోంది. ఏకంగా 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తేరాకెక్కనున్నట్లు టాక్.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పూర్తి విషయంలోకి వెళ్తే రామ్ చరణ్, బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) లతో.. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Shankar) ఈ మల్టీ స్టార్ చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం నీటిలోనే సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో… స్క్రిప్ట్ ఉండనున్నట్లు.. ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నట్లు కూడా టాక్ నడుస్తోంది. అంతా ఓకే అయితే సినిమా సెట్స్ మీదకు వెళ్తే ఇండియాలోనే బిగ్గెస్ట్ భారీ బడ్జెట్ మల్టీస్టారర్ సినిమా అవుతుంది. అయితే త్వరలో ఈ సినిమాకి సంబంధించిన క్లారిటీ రానున్నట్లు సమాచారం.
ప్రస్తుతం శంకర్..చరణ్ తో సినిమా చేస్తున్నారు. రామ్ చరణ్ కెరియర్ లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా. మూడు విభిన్నమైన పాత్రలలో చరణ్ కనిపించనున్నట్లు సమాచారం. అందులో ఒకటి ముఖ్యమంత్రి పాత్ర అని అంటున్నారు. రాజకీయ నేపథ్యంలో మెసేజ్ ఓరియెంటెడ్ తరహాలో.. శంకర్ ఈ సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ సినిమాలో చరణ్ లుక్ కి సంబంధించి ఒక ఫోటో విడుదల చేయడం జరిగింది. ఫుల్ గడ్డంతో.. స్టైలిష్ లుక్ లో చెర్రీ ఉండటంతో… సోషల్ మీడియాలో ఫోటో వైరల్ అయింది. ఇదిలా ఉంటే వచ్చే ఆగస్టు మాసంలో చిరంజీవి పుట్టినరోజు నాడు సినిమా టైటిల్ తో కూడిన పోస్టర్ లేదా వీడియో.. విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా తర్వాత శంకర్… ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నట్టు ఆ తర్వాత.. చెర్రీ, హృతిక్ రోషన్ మల్టీస్టారర్ ప్రాజెక్టు ఉండనున్నట్లు టాక్ నడుస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?