‘ఆర్ఎక్స్100’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఢిల్లీ ముద్దుగుమ్మ పాయల్ రాజపుత్. ఆ సినిమాలో తను చేసిన బోల్డ్ క్యారెక్టర్ కి ప్రేక్షకులతో ఎన్నో ప్రశంసలు దక్కించుకుంది. ఫస్ట్ సినిమాలోనే తన పెర్ఫార్మన్స్ కి ఫిదా అయిపోయారు మన తెలుగు ప్రేక్షకులు. ఇక తను తెలుగులో బిజీ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ పాయల్ కి క్రేజ్ అయితే వచ్చింది కానీ అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు.
‘ఆర్ఎక్స్100’ తర్వాత పాయల్ రాజపుట్ ‘ఆర్డిఎక్స్ లవ్’ అనే మరో సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ లో నటించింది. కానీ తన కెరీర్ లో అదొక పెద్ద డిసాస్టర్ గా మిగిలిపోయింది. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా ‘సీత’ లో ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించింది. చాలా గ్యాప్ తర్వాత ఆమెకు గతేడాది నాగచైతన్య విక్టరీ వెంకటేష్ లు నటించిన ‘వెంకిమామ’ సినిమాలో వెంకీకి జోడిగా నటించింది. ఆ సినిమా కూడా హిట్ అయ్యింది కానీ పాయల్ కి మాత్రం అవకాశాలు తెచ్చిపెట్టలేదు.
ప్రస్తుతం కరోనా కారణంగా అన్ని ఇండస్ట్రీలు ఓటిటిల వైపు మొగ్గుచూపుతున్నాయి. ఎందుకంటే లాక్ డౌన్ వలన సినీ ప్రేక్షకులు ఓటిటిలే అలవాటుపడ్డారు మరియు వారికి అవే వినోదాన్ని అందించాయి. సినీతారలు కూడా ఒకపక్కన సినిమాలు చేస్తున్నా ఇటు ఓటిటిలకు ఓకే చెప్పడం మాత్రం ఆపట్లేదు.
ఇప్పటికే షూటింగులు లేక టాలీవుడ్ లో ఉన్న మాక్సిమం హీరో మరియు హీరోయిన్లు అంతా ఓటిటి బాట పట్టిన సంగతి మనకి విదితమే. తాజాగా పాయల్ రాజపుత్ కూడా అదే బాటలోకి వెళ్తోంది. ఇటీవల యంగ్ డైరెక్టర్ అవినాష్ కోకాటి చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో ఈ వెబ్ ఫిల్మ్ కి ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం.