Inter-Religion marriages: ప్రస్తుతం భారత్ లో దేశవ్యాప్తంగా ‘లవ్ జీహాదీ’ పై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలలో అనగా ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక లో మతాంతర వివాహాల Inter-religion marriages పై ప్రత్యేక చట్టాన్నే తీసుకొచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇటువంటి చట్టాన్ని తీసుకొస్తుందా అన్న ప్రశ్నకు ఇటీవల అటువంటి ఉద్దేశం ఏం లేదని స్పష్టం చేసింది. తాజాగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి పార్లమెంట్లో ఈ విషయమై మాట్లాడుతూ మత విశ్వాసాలకు సంబంధించిన నేరాలు కానీ, కేసులు నమోదు చేయడం, ఆ కేసులను దర్యాప్తు చేయడం, వాటిని ప్రాసిక్యూషన్ చేయడం రాష్ట్రాల పరిధిలోవని ఆయన స్పష్టం చేశారు.
లోక్సభలో ఓ సభ్యుడి అడిగిన ప్రశ్నకు సమాధానం కేంద్రానికి మతాంతర వివాహాలకు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకొచ్చే ఉద్దేశం ఏమిలేదని అన్నారు. అంతేకాకుండా మన దేశంలో మతాంతర వివాహాల వెనుక బలవంతపు మత మార్పిడి జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందా అన్న ప్రశ్నకు మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ ప్రకారం పోలీస్ మరియు పబ్లిక్ ఆర్డర్ అంశాలు కేంద్రప్రభుత్వం పరిధిలోకి రావని కేవలం రాష్ట్రాల పరిధిలోకి వస్తాయి. అలాగే మతాంతర విహాలలో బలవంతపు మత మార్పిడిల నేరాలకు సంబంధించి కేసులు, అందుకు సంబంధించిన విచారణఅన్నీ ప్రాథమికంగా ఆయా రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల పరిధిలోకి వస్తాయి. రాష్ట్ర ప్ప్రభుత్వాలే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాయి’ అని ఆయన స్పష్టం చేసారు.
త్వరలో ఏదైనా మతాంతర వివాహాలను నిరోధించే చట్టాన్ని తీసుకురావాలని కేంద్రం ఆలోచిస్తోందా అని మరో సభ్యుడు అడగగా అటువంటిది ఏం లేదు అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి బదులిచ్చారు.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.