దేశవ్యాప్తంగా కోవిడ్ బారిన పడుతున్న అనేక మందిలో చాలా వరకు హోం ఐసొలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్న విషయం విదితమే. కేవలం కొందరికి మాత్రమే పరిస్థితి తీవ్రమవుతోంది. అయితే కోవిడ్ బారి నుంచి కోలుకున్నప్పటికీ బాధితులు జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే ఇన్ఫెక్షన్ మళ్లీ తిరగబెట్టేందుకు అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. ఈ క్రమంలోనే కోవిడ్ బారి నుంచి కోలుకున్న వారికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పలు ప్రత్యేక సూచనలు చేసింది. అవేమిటంటే…
కోవిడ్ నుంచి కోలుకున్నవారు నిత్యం ఆయుర్వేద ఔషధం చ్యవన్ప్రాశ్ను తప్పనిసరిగా తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే నిత్యం యోగా, వాకింగ్ చేయడం, వ్యాయామాలు చేయడం, వేడి నీళ్లు గొంతులో పోసుకుని పుక్కిలించడం చేయాలి.
కోవిడ్ బారిన పడి కోలుకున్నవారు ప్రతి వారం, 10 రోజులకు ఒకసారి కొంత కాలం పాటు డాక్టర్చే చెకప్ చేయించుకోవాలని కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కోవిడ్ నెగెటివ్ వచ్చినప్పటికీ దాని నుంచి పూర్తిగా బయటపడి కోలుకునేందుకు ఎక్కువ రోజులే పడుతుంది కనుక కనీసం అప్పటి వరకైనా పైన తెలిపిన జాగ్రత్తలను పాటించాలని లేదంటే కోవిడ్ లక్షణాలు మళ్లీ మొదలై వైరస్ రీ ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?