మంచీ చెడూ తేడా లేకుండా మాట్లాడి వార్తల్లోకి ఎక్కే వ్యసనం ఉన్న కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే తాను ఎంత అధమ స్ధాయికి వెళ్లగలనో మరోసారి నిరూపించారు. హిందూ యువతిని ఎవరైనా తాకితే ఆ తాకిన చేయి తీసేయాలని ఆయన ఒక సభలో అన్నారు. దానిపై కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ గుండూరావు స్పందించినందుకు ఆయన ముస్లిం భార్యను కేంద్ర మంత్రి వివాదంలోకి లాగారు. ఆయన సంస్కారం అంతలో ఉంది మనం ఏం చేయగలం అని గుండూరావు వ్యాఖ్యానించారు.
కర్నాటకలోని కొడగు జిల్లాలో అనంతకుమార్ ఆదివారం ఒక సభలో ప్రసంగించారు. ‘మనం మన ప్రాధామ్యాలను పునరాలోచించుకోవాలి. కులాలు పక్కన పెట్టాలి. హిందూ యువతిని ఎవరైనా తాకితే ఆ తాకిన చేయి తీసేయాలి’, అని ఆయన అన్నారు. ‘తాజ్మహల్ కట్టింది ముస్లిం రాజులు కాదు. తను రాజా జయసింహ నుంచి ఆ భవనాన్ని కొనుగోలు చేసినట్లు షాజహాన్ తన ఆత్మకథలో రాసుకున్నాడు. అది పరమతీర్ధ రాజు నిర్మించిన శివాలయం, తేజోమహాలయ. తేజోమహాలయ కాస్తా తాజ్మహల్ అయింది. మనం నిద్రపోతే మన ఇళ్లను మంజిల్ అంటారు. రాముడ్ని జహాపనా అంటారు. సీతను బీబీ అంటారు’, అని మంత్రి వ్యాఖ్యానించారు.
ఈ ప్రసంగంపై స్పందించిన గుండూరావు ట్విట్టర్లో, ‘కేంద్ర మంత్రి అయిన తర్వాత కర్నాటకకు మీరు చేసింది ఏమిటి. మీరు సాధించిన విజయాలు ఏమిటి’ అని ప్రశ్నిస్తూ, ఇలాంటి వ్యక్తులు ఎంపీలుగా గెలిచి మంత్రులు కావడం శోచనీయమని పేర్కొన్నారు.
@AnantkumarH
Wht are ur achievements after becoming a Union Minister or as MP?
Wht are ur contributions for Karnataka’s development?
All I can say for sure,it’s deplorable tht such people have become ministers & have managed to get elected as MP’s. https://t.co/IMtjPSj9aK— Dinesh Gundu Rao/ದಿನೇಶ್ ಗುಂಡೂರಾವ್ (@dineshgrao) January 27, 2019
దీనికి ట్విట్టర్లోనే మంత్రి స్పందించారు: ‘ఇతని ప్రశ్నలకు తప్పనిసరిగా జవాబిస్తాను. దానికి ముందు తాను ఎవరో చెప్పాలి. ఇతగాడు ఒక ముస్లిం యువతి వెంట పడినవాడని నాకు తెలుసు’ ముస్లిం యువతి అన్న ప్రస్తావన గుండూరావు భార్య తబూ రావును ఉద్దేశించినది.
I shall definitely answer this guy @dineshgrao's queries, before which could he please reveal himself as to who he is along with his achievements?
I only know him as a guy who ran behind a Muslim lady. https://t.co/8hVJ2wQXMU— Anantkumar Hegde (@AnantkumarH) January 27, 2019
ఈ దాడికి స్పందించిన గుండూరావు, ‘వ్యక్తిగత విషయాలు బజారుకీడ్చే స్థాయికి మంత్రి దిగజారడం చాలా విచారకరం. అతని సంస్కారం అంత స్థాయిలో ఉంది. హిందూమత గ్రంధాల నుంచి అతడేమీ నేర్చుకున్నట్లు లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రయత్నిస్తే హుందాతనం నేర్చుకోవచ్చు’ అని వ్యాఖ్యానించారు.
Sad to see @AnantkumarH stoop to such low levels as to bring in personal issues.
Guess it’s his lack of culture.
Guess he hasn’t learnt from our Hindu scriptures.
Time hasn’t run out, he can still try and become a more dignified human. https://t.co/AaX5OuUAVb— Dinesh Gundu Rao/ದಿನೇಶ್ ಗುಂಡೂರಾವ್ (@dineshgrao) January 28, 2019
అనంతకుమార్ హెగ్డే ఇలా అనుచితంగా మాట్లాడడం కొత్తేం కాదు. శబరిమల వివాదంలో కేరళ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు హిందువులను పట్టపగలు రేప్ చేయడమేనని ఆయన ఆ మధ్య అన్నారు.గత సంవత్సరం తన కారును ఆపినందుకు దళితులను రోడ్డుపై మొరిగే కుక్కలుగా అభివర్ణించారు. దాని తర్వాత ప్రతిపక్షాలను ఉద్దేశించి, పులిలాంటి నరేంద్ర మోదీపై పోరాటానికి వచ్చిన కాకులు, కోతులు, నక్కలు అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజ్యాంగంలోనుంచి సెక్యులర్ అనే పదాన్ని తొలగించేందుకు రాజ్యాంగ సవరణ 2017 లో ఆయన అన్న మాట పెద్ద వివాదానికి దారి తీసింది.
తాజా వివాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా స్పందించారు. ఇతను మంత్రిగా ఉండేందుకు అనర్హుడు అని ఆయన వ్యాఖ్యానించారు.
This man is an embarrassment to every Indian. He's unfit to be a Union Minister and deserves to be sacked. https://t.co/SbrvEdQBur
— Rahul Gandhi (@RahulGandhi) January 28, 2019