కరోనా పాజిటివ్ కేసులు భారతదేశంలో అంతకంతకూ పెరుగుతున్నాయి. ఎక్కడా కూడా కరోనా తగ్గడం అన్నది కనిపించట్లేదు. వరసగా రాజకీయ నాయకులు కరోనా బారిన పడుతున్నారు. వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్న వీరికి కరోనా సోకుతోంది.
ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు కరోనా పాజిటివ్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. కరోనా సోకడంతో ఇప్పుడు షెకావత్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందనున్నారు. ఈ నెల ఇరవై ఐదవ తారీఖున అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగవలసి ఉంది. ఇరు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇప్పుడు షెకావత్ కు కరోనా సోకడంతో ఈ సమావేశం జరగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి.