ఎన్డీఏ కూటమి నుండి అకాలీదళ్ వీడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. నేడు కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ సంబంధిత బిల్లులు ఎన్డీఏ కూటమిలో చిచ్చు పెట్టాయి. అకాలీదళ్ ఎన్డీఏ కూటమిలో కీలక సభ్యులుగా ఉన్న విషయం తెల్సిందే.
కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెడుతుందని అకాలీదళ్ విభేదించింది. సభలోనే మిత్రపక్షం ఈ విధమైన అభ్యంతరాలు తెలపడంతో కేంద్రం ఇరకాటంలో పడింది. ఈ సందర్భంగా రెండు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తామని అకాలీదళ్ స్పష్టం చేసింది. అలాగే బిల్లులకు వ్యతిరేకంగా మంత్రి పదవులు వదులుకోవాలని అకాలీదళ్ నిర్ణయం తీసుకుంది. కేంద్రమంత్రి హర్ సిమ్రత్ కౌర్ తన పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామా పత్రాన్ని సమర్పించేందుకు ఆమె ప్రధాని మోదీ కార్యాలయానికి వెళ్లారు.