(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ పెద్ద ప్రమాదం నుండి బయట పడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైంది. బీహార్ రాజధాని పాట్నాలో ఘటన జరిగింది. బీహార్ లో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని వస్తుండగా హెలికాఫ్టర్ కు కరెంటు తీగలు తగలడంతో హెలికాప్టర్ రెక్కలు విరిగి పోయాయి.
అయితే ఈ ప్రమాదం నుండి కేంద్ర మంత్రి శంకర్ ప్రసాద్ బయట పడ్డారు. హెలికాప్టర్ లో రవిశంకర్ ప్రసాద్ తో పాటు బీహార్ మంత్రి మంగల్ పాండే, సంజయ్ కూడా ఉన్నారు. కాగా హెలికాప్టర్ ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ కార్యాలయం స్పందించింది. మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఉన్నారని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఎన్ డీ ఏ అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు.