యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది.. Union public service commission ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 249 పోస్టులను భర్తీ చేయనుంది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
మొత్తం ఖాళీలు : 249 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్: 116 పోస్టులు
అర్హతలు :
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్, బిఈ, కంప్యూటర్స్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ , కంప్యూటర్ సైన్స్ లోమాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు : 30 సంవత్సరాలు దాట కూడదు.
2. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ :80 పోస్టులు
అర్హతలు :ఎల్ ఎల్ బి ఉత్తీర్ణత బార్ అసోసియేషన్ లో మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు : 30 సంవత్సరాలు దాట కూడదు.
3. లెక్చరర్ :1 పోస్టు
అర్హతలు :
సోషల్ వర్క్ లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు : 35 సంవత్సరాలు దాట కూడదు.
4. స్పెషలిస్ట్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్: 45పోస్టులు
అర్హతలు : ఎం బి బి ఎస్ తో పాటు సంబంధిత స్పెషలైజేషన్లు లో పీజీ డిగ్రీ , పీజీ డిప్లమో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పని లో కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయసు : 40 సంవత్సరాలు దాట కూడదు.
5.అసిస్టెంట్ డైరెక్టర్ :1పోస్ట్
అర్హతలు :సివిల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత.
వయసు : 35 సంవత్సరాలు దాట కూడదు.
6. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ : 6 పోస్టులు
అర్హతలు: షుగర్ టెక్నాలజీ లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత తోపాటు పీజీ డిప్లమో, ఆయిల్ టెక్నాలజీలో సంబంధిత పనిలో ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
వయసు : 30 సంవత్సరాలు దాట కూడదు.
ఎంపిక విధానం :రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తు రుసుం :రూ. 25 చెల్లించాలి. ఎస్సీ , ఎస్టీ , పీహెచ్డీ , మహిళా అభ్యర్థులు ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదు.
దరఖాస్తులకు చివరి తేదీ : 11/2/2021