Unity 22: ప్రపంచ కుబేరుడు, వర్జిన్ గ్రూపు అధినేత రిచర్డ్ బ్రాన్సన్ చేపట్టిన అంతరిక్ష యాత్ర విజయవంతం అయ్యింది. కొద్ది సేపటి క్రితం నింగికి ఎగిరిన వ్యోమనౌక గంట తర్వాత సురక్షితంగా తిరిగి వచ్చింది. రిచర్డ్ బ్రాన్సన్, మరో అయిదుగురు వ్యోమగాములతో కూడిన యూనిటీ – 22 నౌక సురక్షితంగా భూమిపై ల్యాండైంది.
రోదసిలోకి మన తెలుగు అమ్మాయి తొలి సారిగా ప్రవేశించారు. ఏపిలోని గుంటూరు జిల్లాకు చెందిన శిరీష బండ్ల ఈ ఘటన సాదించారు. ఈ యాత్ర విజయవంతం అవ్వడంతో భారత్ నుండి అంతరిక్షానికి వెళ్లిన నాల్గవ వ్యోమగామిగా శిరీష నిలిచారు. గతంలో రాకేశ్ శర్మ, కల్పనా చౌవ్లా, భారత – అమెరికన్ సునీతా విలియమ్స్ రోదసిలోకి వెళ్లి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో జన్మించిన శిరీష బండ్ల తల్లిదండ్రులతో పాటు ఆమెరికాలోని హ్యూస్టన్ లో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆమె వర్జిన్ గెలాక్టిక్ లో ప్రభుత్వ వ్యవహారాలు, పరిశోధన కార్యకలాపాల విభాగానికి ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. కాగా భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించాలన్న రిచర్డ్ బ్రాన్సన్ ఆశలకు ఈ యాత్ర విజయవంతం అవ్వడం మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.