జబర్దస్త్.. ఖతర్నాక్ కామెడీ షోకు తెలుగు ప్రేక్షకుల్లో ఎంత ఆదరణ లభించిందో అందరికీ తెలుసు. అప్పటి వరకు ఏ తెలుగు టీవీ షోకు రానంత టీఆర్పీ ఒక్క జబర్దస్త్ కే వచ్చేది. స్థార్ట్ అయి ఏడెనిమిది ఏళ్లు అయినా ఇఫ్పటికీ.. జబర్దస్త్ షో నెంబర్ వన్ గా నిలుస్తోంది. దానికి కారణం అది కామెడీ షో కావడం.. ఎంటర్ టైన్ మెంట్ స్కిట్లతో ప్రేక్షకులను టీమ్ లీడర్లు అలరించడం.
నిజానికి జబర్దస్త్ షో చాలామందికి లైఫ్ ఇచ్చింది. చాలామంది తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవడానికి దాన్ని ఒక వేదికగా మార్చుకున్నారు. అలా చాలామంది సక్సెస్ అయ్యారు. సెలబ్రిటీలు అయ్యారు. ఎంతో మందికి లైఫ్ ఇఛ్చిన జబర్దస్త్ పై చాలా రోజుల నుంచి ఎన్నో విమర్శలు వస్తున్నాయి.
షోలో బూతులు ఎక్కువయ్యాయని.. కుటుంబంతో కలిసి ఈ షోను చాలామంది చూడలేకపోతున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. దానికి కారణం అన్నీ డబుల్ మీనిండ్ డైలాగులతో చేసే స్కిట్లేనంటూ అప్పట్లో పెద్ద దుమారమే లేచింది. అయినా కూడా జబర్దస్త్ అలాగే కంటిన్యూ అవుతోంది.
అయితే.. ఇక్కడ జబర్దస్త్ కు సంబంధించిన మరో కోణం గురించి మాట్లాడుకోవాలి. ముఖ్యంగా జడ్జిలు కొంతమంది స్కిట్లు మాత్రమే చూస్తారని.. కొందరి స్కిట్లనైతే చూడకుండానే లేచిపోతారని.. ఉన్నా కూడా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారని.. డైరెక్టర్లు చెప్పినప్పుడు మాత్రమే నవ్వుతారని.. ఇలా ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి.
ఇంకో విషయం ఏంటంటే.. కొందరు కంటెస్టెంట్లు ఎంత బాగా స్కిట్లు చేసినా కూడా కొన్ని సార్లు వాటిని టెలికాస్ట్ చేయకుండానే కట్ చేస్తున్నారట. మరికొన్ని స్కిట్లలో ఎన్నో కోతలు విధిస్తున్నారట.
దీంతో ఎంతో కష్టపడి స్కిట్లు చేస్తే ఇలా లేపేస్తే ఎలా? అంటూ కొందరు కంటెస్టెంట్లు బోరుమంటున్నారట. నిజానికి జబర్దస్త్ లో ఒక్క స్కిట్ చేయాలంటేనే ఎంతో కష్టపడాలి. టీమ్ ను బిల్డ్ చేసుకోవడమే కాదు.. దానికి తగ్గ కాస్ట్యూమ్, స్క్రిప్ట్, డైలాగులు.. అన్నీ ఉండాలి. అవన్నీ ఉంటేనే స్కిట్ నడిచేది.
ఇవన్నీ సెట్ చేసుకొని తీరా స్కిట్ చేశాక.. దాన్ని ఎడిటింగ్ లో లేపేస్తే ఎలా అంటూ కొందరు కంటెస్టెంట్లు తమ సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. మరోవైపు ఇటీవలే జబర్దస్త్ లో చేరిన తాగుబోతు రమేశ్ పరిస్థితి కూడా అలాగే ఉందట. ఎంతో కష్టపడి జీవన్ తో కలిసి రమేశ్ స్కిట్ చేసినా.. జడ్జిలు స్కిట్ సరిగా చేయడం లేదంటూ విమర్శిస్తున్నారట. తనను తాను నిరూపించుకోవడం కోసం తాగుబోతు రమేష్ ఎన్నో పాట్లు పడుతున్నట్టు తెలుస్తోంది. అటు ఉండలేక.. బయటికి వెళ్లలేక కొందరు కమెడియన్లు నరకం అనుభవిస్తున్నారట.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?