సుశాంత్ సింగ్ రాజపుత్ మిస్టరీ మరణం గుర్తుందిగా… బాలీవుడ్ మొత్తాన్ని ఊపేసిన సంఘటన. దీని తర్వాత పెద్ద ఉద్యమం నడిచింది. సుశాంత్ మరణం వెనుక రకరకాల కోణాలు బయటకు వచ్చాయి. ఆ సమయంలోనే బాలీవుడ్ లో డ్రగ్స్ ఎంత ప్రభావం చూపిస్తున్నాయి అనే విషయాలు సంచలనం అయ్యాయి. ఈ కేసును చాల మంది మర్చిపోయినా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సి బి) మాత్రం వదల్లేదు. ముఖ్యంగా డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయన్న దాన్ని, దానిలో ఎవరెవరికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అన్న విషయాలు కూపీ లాగుతోంది. పూర్తిస్థాయి డెప్త్ లోకి వెళ్లి ఈ డ్రగ్స్ రాకెట్ గుట్టు విప్పనుంది…
తవ్వే కొద్దీ కొత్త పేర్లు … వ్యవహారాలు
ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసే కొద్దీ కొత్తవారి పేర్లు, వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కువగా డ్రగ్స్ అమ్మే పెద్ద డాన్ ల లింకులు బయట పడుతున్నాయి. ఇవన్నీ ఎన్ సి బి అధికారులనే నివ్వెర పరుస్తున్నాయి. సుశాంత్ కేసులో మొదట అతడి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి పేరు రాగానే దర్యాప్తు మొదలెట్టిన పోలీసులు డ్రగ్స్ లింకులు బయట పడగానే కేసును ఎన్ సి బికు ఇచ్చారు. వారి దర్యాప్తు వేగం పుంజికోవడంతో పాటు, బాలీవుడ్ ప్రముఖులకు భారీగా డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనే అంశాలు బయటపడుతున్నాయి. దీనిలో మూలాల కోసం దర్యాప్తు అధికారులు శ్రమిస్తున్నారు.
** డ్రగ్స్ తీసుకున్న వారు బాధితులు అవుతారు తప్ప నేరస్థులు కారు. దింతో ఇప్పుడు ఈ డ్రగ్స్ ని అమ్ముతున్న చీకటి ముఠాలపై నార్కో అధికారులు ద్రుష్టి పెడుతున్నారు. ఎప్పటి నుంచో సినీ పరిశ్రమలో డ్రగ్స్ కలకలం ఉంది. అయితే డ్రగ్స్ తీసుకున్న వారు కేవలం విక్టిమ్ అవుతారు కాబట్టి కేసులు పెట్టేందుకు వీలు ఉండదు. అందులోను భారీ మోతాదులో వినియోగిస్తే కేసు తో పాటు రీహాబిటేషన్ సెంటర్ కు పంపాల్సి ఉంటుంది. ఇప్పుడు బాలీవుడ్ కు డ్రగ్స్ ఎక్కడి నుంచి అందుతున్నాయి అనే విషయాలపైనే ఎక్కువగా అధికారులు ద్రుష్టి పెట్టారు.
** నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కొద్ది రోజులుగా పలువురు సెలబ్రిటీలని విచారిస్తూ వారి నుండి కీలక సమాచారాన్ని రాబడుతుంది. గత 45 రోజులలో సెలబ్రిటీలతో పాటు వారికి సంబంధం ఉన్న వారి దగ్గర నుండి 85 గాడ్జెట్స్ని ఎన్సీబీ సంస్థ సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. గాంధీనగర్లోని ఫోరెన్సిక్ సైన్సెస్ డైరెక్టరేట్ (డిఎఫ్ఎస్) ఫోన్లో డాటాని వెలికితీస్తుండగా, 30 సెల్ఫోన్స్ నుండి పొందిన డాటాతో ముంబైలో దాడులు చేసి అరెస్ట్ చేస్తుంది ఎన్సీబి. ముంబై లో దొరికిన వారిని విచారణ చేస్తే మరికొన్ని అంతర్జాతీయ స్మగ్లర్ల పేరు బయటకు వస్తున్నాయి. వారథి లింక్ లు ఉన్నవారు, డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిని పట్టుకుని ఒక్కొక్కరిని విచారిస్తుండటంతో కేసు పురోగతి ఆలస్యం అవుతోంది.
** ఇప్పటికే ఈ కేసులో సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోయిక్, సారా అలీ ఖాన్, అర్జున్ రాంపాల్, శ్రద్ధా కపూర్, దీపికా పదుకొనే మరియు వారి సహచరులకు చెందిన సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. సుశాంత్ మృతి కేసులో మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. డ్రగ్స్ వ్యవహారాన్ని ఎన్సీబీకు అప్పగించింది. ఇప్పటికే రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడు షోయిక్లను ఎన్సిబి అరెస్టు చేసి, కొన్ని రోజులు కస్టడీలో ఉంచిన తరువాత వారికి బెయిల్ ఇచ్చారు. అంతేకాక పలువురు బాలీవుడ్ ప్రముఖులను, మాదకద్రవ్యాల సరఫరాదారులను కూడా ఎన్సిబి ప్రశ్నించింది.
** సుశాంత్ మృతి సాధారణంగా జరిగింది కాదు అనే ప్రాధమిక నిర్ధారణకు అధికారులు వచ్చినట్లు తెలిసింది. ఎంతో తెలివిగా చేతికి మట్టి అంట కుండా సుశాంత్ ను చంపాలని పక్క ప్లాన్ ప్రకారమే వ్యవహారం సాగినట్లు ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో బయటపడినట్లు సమాచారం. అయితే దీనిలో అన్ని కోణాలు పరిశీలించిన తర్వాతే కేసు గురించి పూర్తిగా బయటపెట్టే అవకాశం ఉంది.