Assam: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇటీవల వెలువడగా అసోం మినహా మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో కొత్త ప్రభుత్వాలు కొలువుతీరాయి. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్, పుదుచ్చేరిలో రంగస్వామి, కేరళలో వినరయి విజయన్ ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అసోంలో మాత్రం ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ అధికారాన్ని నిలబెట్టుకున్న విషయం తెలిసిందే. అసోం లో మొత్తం 126 స్థానాలకు గానూ 75 సీట్లలో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. ఫలితాలు వెలువడి వారం రోజులు అవుతున్నా సీఎం ఎంపికపై ప్రతిష్టంభన కొనసాగుతున్నది. సీఎం ఎవరనేది బీజేపీ అధిష్టానం ఇప్పటి వరకూ తేల్చలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి శర్వానంద్ సోనోవాల్ తోపాటు, ఆర్థిక మంత్రి హిమాంత బిశ్వ శర్మ సీఎం రేసులో ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ గేమ్ ప్లాన్ స్టార్ట్ చేయడంతో రాజకీయాలు వేడెక్కాయి. హిమాంత్ బిశ్వ శర్మ బీజేపీ నుండి తన వర్గంతో బయటకు వస్తే తమ పార్టీకి చెందిన 29 మంది ఎమ్మెల్యేల మద్దతు ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్ చేసింది. 2015 వరకూ బిశ్వ శర్మ కాంగ్రెస్ లోనే ఉన్నారు. దీంతో కాంగ్రెస్ ఈ ఆఫర్ ఇవ్వడంతో రాజకీయాలు వెడెక్కాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కేంద్ర నాయకత్వం నుండి శర్వానంద్ సోనోవాల్, హిమాంత బిశ్వ శర్మ లకు పిలుపు రావడంతో శనివారం ఢిల్లీకి చేరుకుని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాతో సమావేశమైయ్యారు. అయితే శనివారం రాత్రి వరకూ ఏకాభిప్రాయం జరగలేదని తెలిసింది.
ఈ నేపథ్యంలో సీఎం ఎన్నికకు గానూ నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించి నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరున్ సింగ్ పరిశీలకులుగా బీజేపీ అధిష్టానం నియమించింది. వీరు ఒకటి రెండు రోజుల్లో ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకుని సీఎంను ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సీఎం ఎంపిక రాజకీయం తీవ్ర చర్చనీయాంశమవుతోంది,
Union Minister Narendra Singh Tomar and BJP National General Secretary Arun Singh have been made party's Observers for Assam. Under them, the newly elected MLAs will decide on the leader of the legislative party.
(File photos) pic.twitter.com/KUDCnv7mV8
— ANI (@ANI) May 8, 2021