ప్రస్తుతం బీజేపీ డ్రామానా..? పవన్ పోరాటమా..??కి ఒక రేంజ్ ఉందంటే దానికి కారణం అమిత్ షా ఒకరైతే.. మరొకరు ప్రధాని నరేంద్ర మోడీ. అవును.. ఆయనే లేకపోతే ప్రస్తుతం బీజేపీకి ఉన్నఈ స్థానాన్న కూడా ఊహించిఉండేవాళ్లం కాదు. సరే.. బీజేపీకి ఎక్కువగా పాపులారిటీ ఉన్నది నార్త్ లో. సౌత్ లో ఇంకా పార్టీ పునాదులు కూడా లేవలేదు. ఏదో కర్ణాటకలో తప్పితే మరే రాష్ట్రంలో బీజేపీకి పలుకుబడి లేదు.
మరోవైపు కొత్త రాష్ట్రం ఏపీ ని తీసుకుంటే.. ప్రధాని మోడీ కానీ.. కేంద్ర ప్రభుత్వం కానీ ఏపీకి చేసిందేమీ లేదు. అందుకే.. ఏపీ బీజేపీ నేతలు ఏపీలో ఆయన పేరు ఎత్తాలంటేనే జంకుతున్నారు. మోడీ గురించి మాట్లాడితే తాట తీస్తం. ఆయన ఏపీకి చేసిందేం లేదు.. అంటూ ప్రజలు బీజేపీ నేతలపై కస్సుబుస్సుమంటున్న తరుణంలో మోడీ పాపులారిటీ తగ్గిపోతుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
అంతేనా.. ఏపీ బీజేపీ పరిస్థితి అయితే మరీ అధ్వాన్నం. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అయి ఉండి కనీసం బాధ్యతగా అయినా మెలగాలి కదా. అదేం లేదు. ఎక్కడ చూసినా ఏపీలో బీజేపీవి గ్రూప్ రాజకీయాలే. ఆధిపత్య పోరే. ఏపీలో పునాదులు కూడా లేని పార్టీ.. ఇలా గ్రూపు రాజకీయాలు చేస్తుంటే.. ప్రధాని మోడీ ఏం చేస్తున్నారు? ఆయన ఏపీని ఎందుకు పట్టించుకోవడం లేదు? అనే విషయాలు చర్చకు దారి తీస్తున్నాయి.
పోనీ.. ఇది ఒక్క తెలంగాణలోనే ఉందా? అంటే లేదు.. దేశమంతటా ఇదే పరిస్థితి ఉందట. కొన్ని రాష్ట్రాల్లో అయితే మోడీని చూసి ఓట్లెవరేస్తారు. ఆయన్ను చూసి ఓట్లేసే రోజులు పోయాయి.. అంటూ సంచలన కామెంట్లు చేస్తున్నారు. ఉత్తరాఖండ్ బీజేపీ చీఫ్ అదే చెబుతున్నారు. మోడీని ప్రస్తుతం తురుపు ముక్కగా కూడా చూడలేం అని అంటున్నారు. ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసేవాళ్లు.. తమ వ్యక్తిగత పాపులారిటీని పెంచుకోవాలి కానీ.. మోడీ మీదనే ఇంకెవరి మీదనో ఆశలు పెట్టుకోవద్దు.. అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
ఒకప్పుడు అంటే 2014లో మోడీనే హీరోగా చూపిస్తూ అంతటా ప్రచారం. ఏపీలోనూ అదే తంతు జరిగింది. కానీ.. ఏమైంది.. బీజేపీని ఏపీ ప్రజలు ఎక్కడో తొక్కిపడేశారు. ఏదో టీడీపీ, పవన్ కళ్యాణ్ కలిసి బీజేపీకి సపోర్ట్ ఇచ్చారు కాబట్టి 2014లో బీజేపీ రెండుమూడు సీట్లతో నెట్టుకొచ్చింద. కానీ.. 2019లో మోడీ చరిష్మా ఏదీ ఏపీలో పనిచేయలేదు. ఆయన్ను పట్టించుకున్న నాథుడే లేడు. ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు. రాజధాని విషయంలో పట్టించుకోవడం లేదు. రాజధాని అభివృద్ధి కోసం రూపాయి ఇవ్వట్లేదు.. అనే అపవాదు బీజేపీ పైన ఉంది. అందుకే ఏపీ ప్రజలు నరేంద్ర మోడీని కూడా పట్టించుకోవడం మానేశారు.
ఒక్క ఏపీనే కాదు.. దేశంలోని పలు రాష్ట్రాల్లో మోడీ మానియా లేదు. బీజేపీ పార్టీని పట్టించుకునే పరిస్థితి అస్సలు లేదు. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.