ప్రస్తుతం దేశం మొత్తం ఒక్కటే చర్చ. కొద్ది నిమిషాల క్రితం భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ అయొధ్య లోని జమమందిరానికి శంకుస్థాపన చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఈ సందత్భాని ఒక పర్వంలా పరుపుకుంటున్నారు. అయితే దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఉన్న సమస్యను బిజెపి ప్రభుత్వం ఒక కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఈ విషయాన్ని వారు అంత ఊరికినే వదలరు అన్నది నిపుణుల మాట. మరీ ముఖ్యంగా ఈ రామమందిరం విషయాన్ని తాము హైందవత్వానికి చేసిన మేలు కి ప్రతిఫలంగా బీజేపీ ఏమి ఆశిస్తుంది అన్నదే అందరి ప్రశ్న.
దీనికి ప్రతి ఒక్కరు 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలతో ముడి పెడుతున్నారు. ఇప్పటికే రామ మందిరానికి భారీగా నిధులను కేటాయించిన ప్రభుత్వం ఏకంగా కరోనా సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యకు వెళ్లి మరీ శంకుస్థాపన పనులు చేయడం గమనార్హం. ఇదంతా చేసేది ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి దీనిని ఒక అస్త్రంగా వాడుకునేందుకే అన్నది ప్రతిపక్షం కాంగ్రెస్ వారి మాట. అలాగే ఎన్నికల సమయంలో అనుకోని పరిస్థితుల్లో మతవిద్వేషాలు చెలరేగితే రామమందిరం అంశం చాలా కీలకం అవుతుంది.
అప్పుడు బిజెపి అందుకు తగ్గట్టు ఈ అయోధ్య మందిరాన్ని అడ్డం పెట్టుకుని ఎలాంటి పరిస్థితికైనా సన్నద్ధం కావచ్చు. ఇక అప్పటి వరకు వీలుచిక్కినప్పుడల్లా రామమందిరం నిర్మాణం గురించి ప్రజల్లో బిజెపి తరఫున ఒక సానుకూలమైన అభిప్రాయాన్ని నిలువరిస్తే చాలు…. మిగతాదంతా ఇప్పటికే ఇలాంటి విషయాల్లో ఆరితేరిపోయిన హైకమాండ్ చూసుకుంటుంది.