బులంద్షహర్ మూక హింసాకాండకు బలయిన పోలీసు అధికారి సుబోధ కుమార్ సింగ్ కుటుంబానికి సహాయంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు 70 లక్షల రూపాయలు అందించారు. ఆవు కళేబరాలు కనబడ్డాయన్న కారణంగా డిసెంబర్ మూడవ తేదీన చెలరేగిన హింసాకాండను అదుపు చేసేందుకు వెళ్లిన సుబోధ్ కుమార్ను అల్లర్లకు దిగిన వారే హత్య చేశారు.
సుబోధ్ కుటుంబానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 50 లక్షల సహాయం అందించింది. దానికి అదనంగా ఈ 70 లక్షల రూపాయలు అందించినట్లు సీనియర్ పోలీసు అధికారి ప్రశాంత్ కుమార్ తెలిపారు.
భజరంగ్ దళ్ సభ్యులు ఈ అల్లర్లకు పాల్పడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన భజరంగ్ దళ్ జిల్లా నాయకుడు యోగేష్ రాజ్ను ఇటీవల అరెస్టు చేశారు. సుబోధ్ హత్య జరిగి నెల కాకముందే మరో మూక హింసాకాండ ఘాజీపూర్లో హెడ్ కానిస్టేబుల్ సురేష్ వాట్స్ను బలి తీసుకుంది. సుబోధ్ హత్య ఉదంతాన్ని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ రాజకీయ కుట్రగా అభివర్ణించారు. సుబోధ్ హత్య కేసును నీరు కార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.