అక్కచెల్లెల్లు అంటే అనుబంధానికి, అప్యాయతలకు మారు రూపం అనిచెప్పుకుంటారు. కష్ట సుఖాలను పంచుకుంటూ ఒకరికొకరుగా మెలుగుతారు. కాని వన్స్ పెళ్లి అయితే మాత్రం భర్తే సర్వస్వంగా భావిస్తారు. నేనూ, నా భర్త సంతోషంగా ఉంటే చాలని చూలా మందే అనుకుంటారు. పెళ్లి కాకముందు అక్క చెల్లెల్లు ఎంత మంచిగా కలిసున్నా ఏ విషయంలో నైనా సరే అందరూ ఒకే లాగ ఉన్నా పెళ్లి తర్వాత మాత్రం వారి దారులు వేరైపోతాయి. భర్త అంటే నాకు మాత్రమే సొంతం అని అనుకుంటారు ఆడవారు.
పరాయి స్త్రీ నీడను కూడా తన భర్త ముట్టుకోవద్దని భావిస్తుంటారు. పొరపాటున గాని పరాయి స్త్రీతో చనువుగా మాట్లాడితే ఉంటది ఇక ఆ భర్తకు భార్య చేతిలో దేత్తడి ప్రోగ్రామే.. సొంత చెల్లైనా భరించలేకపోతారు. తనతో కాకుండా పరాయి స్త్రీ తో తన భర్త ఉండటాన్ని ఎట్టి పరిస్థితిలో కలలో కూడా ఊహించుకోదు. ఇలా భర్తలు వేరే వారితో ఉండటం వల్ల నేటి సమాజంలో భార్యభర్తల మధ్య గొడవలు జరిగి విడాకుల దాకా వెళ్లిన సంఘటనలు ఎన్నో.. బతుకు జట్కా బండీలో చాలా మటుకు ఇలాంటి ఘటనలే వస్తాయి. మరీ మీరు కూడా చూసే ఉండొచ్చు.
అందులో తన భర్త చేసిన ఉద్దార్కానికి భార్యలు పెట్టో శోకాలు వింటుంటే అయ్యో ఇలాంటి గతి పగోనికి కూడా రావద్దని అనుకునే వారు చాలా మందే ఉంటారు. ఒక మహిళ భర్త ఏకంగా ముగ్గురిని పెళ్లాడాడు. తనతో కలిపి ముగ్గురిని వివాహం చేసుకుని కృష్ణుడి లెక్క కాలుమీద కాలేసుకుని జీవిస్తున్నాడు ఒక వ్యక్తి. మరి మొదటి భార్య ఏమనలేదా.. అని మీకు సందేహం కలగొచ్చు. కాని ఆమె కూడా అందుకు అంగీకరించింది. ముగ్గురు సవితులు ముచ్చటగా తన భర్తతో హాయిగా గడుపుతున్నారట.. మరి అదేక్కడో తెలుసా…
ఉత్తరప్రదేశ్ కు చెందిన కృష్ట అనే వ్యక్తి ముగ్గురు పెళ్లాల ముద్దుల మొగుడిగా పేరొందుతున్నాడు. కాగా ముగ్గురు సొంత అక్కా చెళ్లుల్లు కావడం అక్కడ విశేషం. వీరు ముగ్గురు చిన్నప్పటినుంచి ఏ పనిచేసినా కలిసే చేయడం అలవాటు కావడం వల్ల ఇలా భర్తను కూడా కలిసే చేసుకున్నారట. వినడానికి విడ్డూరంగా వారి టేస్ట్ లు వారివి కదా.. కాగా వారి పెళ్లి జరిగి 12 ఏండ్లు గడిచినా ఇప్పటి వరకు గొడవలు రాకపోగా అన్యోన్యంగా జీవితాన్ని గడుపుతున్నారట. వీరికి ఒక్కొక్కరికి 2 పిల్లల చొప్పున కృష్ణకు ముగ్గురు పెళ్లాల ద్వారా 6 సంతానం కలిగారట. అందరికి సమానమైన ప్రేమను పంచూతూ హాయిగా జీవిస్తున్నాడు ఈ కలియుగ కృష్ణమూర్తి. వీరికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.