Upasana దేశంలో మొదటి దశ కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ కరోనా టీకాలను వేస్తున్నారు. కోవిడ్ తో యుద్ధంలో ముందు నిలబడే పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది తో సహా అనుబంధ సిబ్బందికి ఈ వ్యాక్సిన్ టీకాలు వరుస పద్ధతిలో అందిస్తున్నారు. అంతేకాకుండా తొలిసారిగా వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది.
కొన్ని చోట్ల ఈ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని…. ఇది ప్రతి ఒక్కరికి సరిపడడంలేదని… కొందరికి వికటిస్తుందని రకరకాల ప్రచారాలు కూడా ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా వ్యాక్సిన్ వేసిన తర్వాత ఒకరిద్దరు మరణించడంతో ఆ విషయం హైలెట్ అవుతోంది. దీనిపై విపరీతమైన అపోహలు పెరిగిపోయాయి. చనిపోయిన వారు వ్యాక్సిన్ వికటించడం వలనో…. లేకపోతే సహజ మరణమా అని డాక్టర్లు నిర్ధారించక ముందే మీడియా వారు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత వీరు చనిపోయారు అని ప్రచారం చేస్తున్నారు.
Upasana ముందుకొచ్చింది
ఇందులో నిజానిజాలు పక్కనపెడితే మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల స్వయంగా రంగంలోకి దిగి అపోలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ధైర్యం చెప్పారు. ఈ మధ్య వ్యాక్సిన్ పై వస్తున్న ప్రచారాల వల్ల ఆమె చేయవలసి వచ్చింది అని చెప్పవచ్చు. ఆమె కూడా వ్యాక్సినేషన్ చేయించుకుని ఇతరులకు ధైర్యం చెప్పారు.
అందరూ వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు రావాలని కోరారు. ఎటువంటి భయాలు లేకుండా తన హాస్పిటల్ ఫ్రెంట్ లైన్ వర్కర్స్ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి అపోహలు వద్దని చెప్పిన ఆమె ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకుంటేనే కరోనా మహమ్మారి నుండి అందరం బయటపడతామని ధైర్యం చెప్పారు. దానికి సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది.