Upasana Ram Charan : టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ భార్యగా.. మెగాస్టార్ చిరంజీవి కోడలుగా.. అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలిగా ఉపాసన కు మంచి ఫాలోయింగ్ ఉంది.. తాజాగా ఉపాసన కొణిదెల సారథ్యంలో బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది.. తెలంగాణ లోని సంగారెడ్డిలో 5 వేల మంది మహిళా వ్యవసాయదారులకు మెరుగైన ఆరోగ్యం, సంపద, శక్తిని , విద్య, నైపుణ్యాల ద్వారా అందించాలని అపోలో హాస్పిటల్స్ లక్ష్యంగా పెట్టుకుంది..
తృణ ధాన్యాల వినియోగాన్ని గురించి ప్రజలలో అవగాహన పెంచడంలో ఎప్పుడు ముందు ఉండే సంస్థ అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్.. ఈ కృషిలో భాగంగా ఇపుడు డెక్కన్ అభివృద్ధి సంఘం డి.డి.ఎస్ ఆధ్వర్యంలో 5వేల మంది మహిళా వ్యవసాయదారుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలన్నది అపోలో హాస్పిటల్స్ లక్ష్యంగా పెట్టుకుంది.. అపోలో హెల్త్ కేర్ గ్రూప్ ఇప్పటికే 4000 కిలోల తృణ ధాన్యాలను సేకరించింది. ఇప్పటి నుంచి ప్రతి నెల 1000 కిలోల తృణ ధాన్యాలను సేకరించి అక్కడి మహిళా వ్యవసాయదారులకు అండగా నిలుస్తుంది..
The @HospitalsApollo Hyderabad will procure 1000kgs of millets every month to enrich the lifestyle of over 5000 women farmers in Sangareddy, Telangana
Empowering the millet sisters, improving gut health for the Apollo Family & protecting the planet ??https://t.co/KL1RSEhqPR pic.twitter.com/EazZGrUOF3
— Upasana Konidela (@upasanakonidela) February 18, 2021
ఈ విషయం పై అపోలో హాస్పిటల్స్ గ్రూప్ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సి.ఎస్.ఆర్) విభాగపు ఛైర్మెన్ శ్రీమతి ఉపాసన కొణిదెల మాట్లాడుతూ, మహిళా వ్యవసాయదారులలో ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచడం మా లక్ష్యం. అందుకు అవసరమైన విద్యను, నైపుణ్యాలను అందించడం ద్వారా మహిళా వ్యవసాయదారులకు ఆరోగ్యంతో పాటు సంపదను కూడా పెంచాలన్నది మా సంకల్పం అని తెలిపారు. తృణ ధాన్యాలలో ప్రోటీన్లు, పీచు పదార్ధాలు , ఐరన్ , క్యాల్షియం వంటివి బియ్యం లో కంటే వీటిలో అధికంగా ఉంటాయని, వీటిని తినడం వలన పోషకాహార లోపాల వలన వచ్చే అనారోగ్య సమస్యలను నిరోధిస్తుందని, మేలైన ఆహారపు అలవాట్లను ఎంచుకోమని, ఆరోగ్యాన్ని వృద్ధి చేసే తృణ ధాన్యాలను కొనుగోలు చేసి పోషక విలువలు ఉన్న ఆహార పదార్ధాల వైపు మళ్ళండి అని ఉపాసన సలహా ఇచ్చారు.