Digital payments: ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉండటం కామన్. ఇక చాలా మంది పాకెట్ లో డబ్బులు పెట్టుకోవడం చాలా వరకు మానేశారు. ఆన్ లైన్ లో, ఆఫ్ లైన్ లో ఏది కొనుగోలు చేసినా డిజిటల్ చెల్లింపులకే ప్రియారిటీ ఇస్తున్నారు. చిన్న కిరాణం షాప్ మొదలుకుని ఎక్కువగా యూపీఐ పేమెంట్స్ చేయడానికి అలవాటు పడ్డారు. ఇలా డిజిటల్, యూపీఐ చెల్లింపులను పెంచేందుకు ఆర్బీఐ కొత్త నిర్ణయాలను తీసుకుంటోంది. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించిన పలు ఇంట్రస్టింగ్ విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ ఇటీవలే మీడియాకు సైతం వెల్లడించారు. మరి అవేంటో తెలుసుకుందాం..
ఫీచర్ ఫోన్స్లో
ఫీచర్ ఫోన్లల్లో ఇంటర్ నెట్ లేకుండానే డిజిటల్ చెల్లింపుల సదుపాయాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు వెల్లడించారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్. తాజాగా మీడియాతో మాట్లాడని ఆయన.. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వచ్చే రోజుల్లో యూపీఐ (యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్) ఆధారిత ఉత్పత్తులను ఫీచర్ ఫోన్స్లో అందుబాటులోనికి తెస్తామని ప్రకటించారు. ఆర్బీఐ ప్రకటనలో తెలియజేసిన వివరాల ప్రకారం.. చిన్న మొత్తాలకు సంబంధించిన పేమెంట్స్ ప్రక్రియను ఈజీగా మార్చేందుకు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నారు.
యూపీఐ పేమెంట్స్ పెంచడానికి ప్రయత్నాలు
యూపీఐ చెల్లింపులకు జనాల్లో ఆదరణ పెరగాలనే లక్ష్యంతోనే ఫీచర్ ఫోన్ల ఆధారంగా పేమెంట్స్ కు చాన్స్ కల్పించనున్నారు. ఐపీఓ ఆఫరింగ్ అప్లికేషన్స్కు యూపీఐ పేమెంట్స్ లిమిట్ ను రెండు లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు పెంచనున్నారు. వాలెట్స్, కార్ట్స్, యూపీఐ ద్వారా చెల్లింపుల్లో వసూళ్లు చేసే చార్జెస్ పై డిస్కషన్ పేపర్ ను రిలీజ్ చేయనున్నట్టు శక్తికాంత దాస్ వెల్లడించారు. మరి ఇంటర్ నెట్ అవసరం లేకుండానే యూపీఐ చెల్లింపుల ఫీచర్ కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రానుంది. దీని వల్ల డిజిటల్ పేమెంట్ మరింతగా పెరిగే చాన్స్ ఉంది.