Uppena : ‘ఉప్పెన’ సినిమా తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఆడియన్స్ దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు. ఈ సినిమా తర్వాత అతను వరస ప్రాజెక్టులతో పూర్తిగా బిజీ అయిపోయాడు. తాజాగా నాగార్జున నిర్మించబోయే ఒక సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నట్లు సమాచారం. నాగార్జునకు నిర్మాతగా మంచి పేరు ఉంది. తన సినిమాలను నిర్మించడమే కాకుండా యువ కథానాయకుల పెట్టి మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేస్తుంటాడు.
ఉదాహరణకు ‘ఉయ్యాలా జంపాలా’ ‘రంగులరాట్నం’ సినిమాలతో రాజ్ తరుణ్ కు మంచి బ్రేక్ ఇచ్చాడు అని చెప్పాలి. ఇప్పుడు కూడా నాగార్జున మరో సినిమా చేయబోతున్నాడట. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రంతో ఒక కొత్త దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడని అంటున్నారు. ఉప్పెన సినిమా దర్శకుడు కూడా కొత్త వాడే కావడం విశేషం. అంతేకాకుండా ఈ సినిమాను మరింత ఎక్కువ బడ్జెట్ తో తీసేందుకు ప్లాన్ చేస్తున్నారట.
విశేషం ఏమిటంటే నాగార్జున కొడుకులిద్దరితో మెగా ఫ్యామిలీకి చెందిన గీతా ఆర్ట్స్ సినిమాలు నిర్మించింది. నాగచైతన్య తో ‘100% లవ్’ తీసిన అల్లు అరవింద్… ప్రస్తుతం అఖిల్ హీరోగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దానికి రివర్స్లో మెగా ఫ్యామిలీకి చెందిన వైష్ణవ్ తో నాగార్జున సినిమా చేస్తుండడం విశేషం.
వైష్ణవ్ ఉప్పెన సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో రకుల్ ప్రీత్ కథానాయికగా ఒక సినిమాని మొదలుపెట్టాడు. కొద్ది నెలల్లోనే దాన్ని పూర్తి చేశాడు కూడా. దాని తర్వాత వైష్ణవ్ చేయబోయే సినిమా నాగార్జున బ్యానర్లోనే తెరకెక్కుతోంది. అంతేకాకుండా ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ చిత్రాలతో మంచి నిర్మాతగా పేరు పొందిన షైన్ స్క్రీన్స్ వారితో కూడా ఒక సినిమా హీరోగా కమిట్మెంట్ ఇచ్చాడట. నాగార్జున తో చేయబోయే ఈ సినిమాతో పరిచయం అయిన డైరెక్టర్ కూడా ఒక పెద్ద స్టార్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ అని వార్తలు వినిపిస్తున్నాయి.