Uppena : ఒకప్పుడు ఇండస్ట్రీ లోనే అతి పెద్ద డైరెక్టర్ గా పేరొందిన పూరి జగన్నాథ్ నెమ్మదిగా తన ఉనికిని కోల్పోయాడు. వరుస డిజాస్టర్లతో ఇక షెడ్డు కి వెళ్ళిపోయాడు అనుకుంటున్న దశలో మళ్లీ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ‘లైగర్’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. మొదట్లో పూరి వైష్ణో అకాడమీ బ్యానర్ పైన పలు హిట్ సినిమాలు తీశారు. ఇప్పుడు పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై ప్రముఖ నటి చార్మి తో కలిసి సినిమాలను నిర్మిస్తున్నారు.
ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత ఈ ప్రొడక్షన్ టీం వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఆకాష్ పూరి హీరోగా మూడో సినిమాకు కూడా సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆకాష్ పూరి దర్శకత్వంలో మెహబూబా చిత్రంలో నటించాడు. ఆ తర్వాత రొమాంటిక్ అని మరొక సినిమా రిలీజ్ కు రెడీ అయింది. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఆకాష్ ‘రొమాంటిక్’ తెరకెక్కుతోంది. త్వరలోనే రొమాంటిక్ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టబోతున్నారు చిత్రయూనిట్.
అంతేకాకుండా ఈ సినిమాను వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుపుతున్నారట. ఇక ముందు చెప్పినట్లు పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై ఆకాష్ తో నిర్మిస్తున్న మరో సినిమాలో హీరోయిన్ కోసం ‘ఉప్పెన’ ఫేం కృతి శెట్టి ని హీరోయిన్ గా అనుకుంటున్నారట. ‘ఉప్పెన’ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. అయితే ఆమె చేతిలో ఇప్పటికే నాని, సుధీర్ బాబు సినిమాలు ఉన్నాయి. మరికొన్ని పెద్ద సినిమాల్లో రెండో హీరోయిన్ గా కూడా ఆమెను పలువురు దర్శకులు పరిగణిస్తున్నారు.
ఇలాంటి సమయంలో పూరి జగన్నాథ్ కొడుకు సినిమాలో ఆమెను హీరోయిన్ గా లాక్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. పూరి తన కథలలో హీరోయిన్స్ కి ఎంతా ప్రాముఖ్యత ఇస్తాడో అందరికీ తెలిసిందే. అంతే కాకుండా హీరోయిన్లను అందంగా చూపించడంలో పూరి తర్వాతే ఎవరైనా. ఇక ఈ సినిమాలన్నీ మెరుగైన ఫలితాలు సాధిస్తే కృతి శెట్టి టాలీవుడ్ అగ్ర హీరోయిన్ అనిపించుకోవడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు.